బ్రిటన్లో సాయిబాబా వ్యతిరేకత
హౖౖెదరాబాద్:చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేస్తున్నారు? అసెంబ్లీసమావేశాలలో అనుచితంగా వ్యవహరించారన్నఆరోపణలను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడులోప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలనుతెలియజేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మోహన్కందాకు లేఖ రాసిమీడియాలోకి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లోగురువారం జరిగిన టిడిపి పోలిట్ బ్యూరోసమావేశంలో మునిసిపల్ ఎన్నికలనుసత్వరం జరిపించాలని డిమాండ్ చేశారు.ఈసమావేశంలో కూడా చంద్రబాబు నాయుడుముక్తసరిగా మాట్లాడారు.
మునిసిపల్ఎన్నికల వరకు ఇలా తగ్గి ఉండాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్టు తెలియవచ్చింది.వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలోపూర్తిగా విఫలమైన తర్వాత ఢిల్లీస్ధాయిలో ప్రచారానికి దిగాలన్నదితెలుగుదేశం ఆలోచనగా ఉంది. ఈలోపుకాంగ్రెస్ పార్టీలోని తన ఏజెంట్ల ద్వారా చంద్రబాబునాయుడు అంతర్గత విషయాలను తెలుసుకుంటున్నారు.రంగారెడ్డి జిల్లాలో నామినేటెడ్ పోస్టులేగాక, ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలుఒక సామాజిక వర్గానికే ఇవ్వడంపై చెలరేగుతున్నవివాదాన్నితెలుగుదేశం అధినాయకత్వంనిశితంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డికి,చంద్రశేఖర్ (ఎస్సి)కు మధ్య జరుగుతున్న వివాదంరసకందాయంలో పడింది. ఈ మంత్రులిద్దరూ ఎవరికివారు సీనియర్లమని క్లెయిమ్ చేసుకుంటున్నారు.
వైఎస్నుసొంత పార్టీ వారే వివిధ జిల్లాల్లో ఇబ్బందుల్లోపడేస్తున్నారు. నెల్లూరి జిల్లాలో ఆదాల, ఆనంవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.వీటన్నిటి దృష్ట్యా వేచి చూసే ధోరణికి కొంతకాలంఅనుసరించాలన్నది తెలుగుదేశంవ్యూహంగా కన్పిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో కాంగ్రెస్పై ఆరోపణలు,విమర్శలు చేయించాలన్నదిఅధినాయకత్వం ఆలోచన.
ఇటీవలికథనాలు
- చక్రబంధంలో చంద్రబాబు
- చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
- పరిటాల రాజకీయ వైరాగ్యం
- మా తెలుగు బాబుకు చాడీల దండ!
- ఇక బాబు రోడ్షోలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్కుఅసమ్మతి బ్రేక్లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications