టిడిపికి తిరిగిఅధికారం తేలిక కాదు
హౖౖెదరాబాద్:చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా వార్తల్లోలేరు. బిజెపితో మునిసిపల్ ఎనికల్లో పొత్తు ఉండదని చెప్పినతర్వాత ఆయన దాదాపు మౌనంగాఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి,వైఎస్ రాజశేఖరరెడ్డికి మధ్యఘర్షణ నేపధ్యంలో వేచి చూసే ధోరణి అనుసరించడంమంచిదనిఆయన భావిస్తున్నారు. ఈలోపుతెలుగుదేశం విధానమైనసమైకాంధ్ర గురించి ఢిల్లీలో టిడిపిఎంపీల ద్వారా ఆయన వాణినివినిపింపజేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఢీకొనగలిగింది ఇప్పట్లో చంద్రశేఖరరావేనని, టిడిపి,కాంగ్రెస్ అసమ్మతి వాదుల వల్ల అదిసాధ్యం కాదని చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అందువల్లనే ఆయనవ్యూహాత్మకంగా మౌనంగావ్యవహరిస్తున్నారు.
గతంలోనేల విడిచి సాము చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడుపొలాల్లోకి దిగివచ్చారు.తెలుగుదేశం పార్టీ మొదటి నుంచిరైతుల అనుకూల ప్రభుత్వమని ఆయనచెప్పడం ప్రారభించారు. అధికారంలోఉన్నంత కాలం ఆయన రైతువ్యతిరేక విధానాలను అనుసరించడం, చంద్రబాబు ఎక్కడపొరపాటు చేశారోపట్టుకుని వైఎస్ అధికారంలోకి రావడంతెలిసిందే. పొరపాటును చాలా ఆలస్యంగా గ్రహించినచంద్రబాబు నాయుడుగతంలో తనను తప్పుదోవపట్టించిన వారిని దూరంగా ఉంచడానికిప్రయత్నించడం లేదు. గతంలో జరిగినతప్పులన్నిటినీ ఈ విధంగా ఆయన నెత్తినవేసుకోవడం మంచి పరిణామమే.












Click it and Unblock the Notifications
