విజయశాంతిహల్చల్
విజయశాంతిచుట్టూ ఇప్పుడు వంది మాగధుల ముఠా చేరింది. తెలంగాణసాధనకు ఒకరాజకీయ పార్టీ పెట్టడానికి ఆమె సిద్ధమయ్యారు. టిఆర్ఎస్, బిజెపిలనుంచి బయటికి వచ్చిన తెలంగాణవాదులతో పాటు కొందరు కాంగ్రెస్ యువనాయకులు కూడా విజయశాంతితో కలిశారు.విజయశాంతి వ్యక్తిగత సహాయకుడుప్రసాద్ తెరవెనుక ఉండి ఫైనాన్స్తదితర వ్యవహారాలు చూసుకుంటున్నారు.
విజయశాంతిసొంతపార్టీ పెడితే టిఆర్ఎస్కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆమె పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. జయలలిత లాగాపార్టీ అన్నీ తానే అన్నట్టు వ్యవహరించాలనివిజయశాంతి నిర్ణయించుకున్నట్టుతెలిసింది. సొంతపార్టీ విషయమై ఆమెతమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో చర్చించిఆమె ఆశీస్సులు తీసుకున్నట్టు చెబుతున్నారు.
మరోవైపువిజయశాంతి ప్రత్యర్ధులు ఆమె చరిత్రనుతిరగదోడి ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదనిప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.విజయశాంతి తాత పశ్చిమగోదావరి జిల్లా నుంచి వరంగల్ జిల్లాఏటూరు నాగారం మండలం రామన్నగూడేనికికొన్ని దశాబ్దాల క్రితం వలస వచ్చారనివీరువివరాలు సేకరించారు. గోదావరి జిల్లాల యాసలోమాట్లాడే విజయశాంతిని తెలంగాణప్రజలు ఎలా ఆదరిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు.విజయశాంతిని రాములమ్మగా అభివర్ణించడం తగదని, ఆమెలోబడుగువర్గాల తరఫున పోరాడేతత్వం లేదని, ఆమె చెన్నైలో చేసిన చీకటి పనులచిట్టా తమ వద్ద ఉందనిటిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.