హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెపి పై కులముద్రా?

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి నేడు అనేక సామాజిక నగ్న సత్యాలను బయటపెట్టారు. కుల, ధనరాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణ కుకట్ పల్లి స్ధానాన్ని ఎందుకు ఎంచుకున్నారని ఆమె ప్రశ్నించారు. కుకట్ పల్లిలో కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్నందువల్లనే ఆయన ఆ స్ధానాన్ని ఎంచుకున్నారని ఆమె భావం.

రాజకీయాల్లోకి వచ్చినతర్వాత ఇటువంటి విమర్శలను జెపి భరించకతప్పదు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నందువల్లనే తెలుగుదేశం ఓడిపోయిందని ఆమె మరో నగ్న సత్యాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పరాజయానికి మరో కారణం లోక్ సత్తా పార్టీ అని ఆమె విశ్లేషించారు. లోక్ సత్తా పొందిన 1 ప్లస్ శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీవేనని ఆమె అభిప్రాయం. అదే విషయాన్ని ఒక ప్రధాన పత్రిక పతాక శీర్షికగా ప్రచురించింది. అంటే కమ్మ వారి ఓట్లు చీలిపోయాయన్న అభిప్రాయాన్ని, ఆమె ఆ పత్రిక ప్రజల ముందు ఉంచాయి.

జయప్రకాష్ నారాయణ వంటి సమాజిక సంస్కరణ వాదులపై కులం ముద్ర వేయడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి వృద్ధాప్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రాజకుమారి తన నోటిని ఎలాగైనా తిప్పగలరు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోదన్న నిస్పృహతోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X