జెపి పై కులముద్రా?
రాజకీయాల్లోకి వచ్చినతర్వాత ఇటువంటి విమర్శలను జెపి భరించకతప్పదు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నందువల్లనే తెలుగుదేశం ఓడిపోయిందని ఆమె మరో నగ్న సత్యాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పరాజయానికి మరో కారణం లోక్ సత్తా పార్టీ అని ఆమె విశ్లేషించారు. లోక్ సత్తా పొందిన 1 ప్లస్ శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీవేనని ఆమె అభిప్రాయం. అదే విషయాన్ని ఒక ప్రధాన పత్రిక పతాక శీర్షికగా ప్రచురించింది. అంటే కమ్మ వారి ఓట్లు చీలిపోయాయన్న అభిప్రాయాన్ని, ఆమె ఆ పత్రిక ప్రజల ముందు ఉంచాయి.
జయప్రకాష్ నారాయణ వంటి సమాజిక సంస్కరణ వాదులపై కులం ముద్ర వేయడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి వృద్ధాప్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రాజకుమారి తన నోటిని ఎలాగైనా తిప్పగలరు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోదన్న నిస్పృహతోనే ఆమె ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలి.