'సాక్షి'లో నాగార్జున!

వార్తాపత్రికను స్వప్రయోజనాలకు వాడుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మరీ ఇంత బరితెగించి జనం సహనాన్ని పరీక్షించేలా ఇలాంటి ఇంటర్వ్యూను పతాక శీర్షికగా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ భూమికి ప్రభుత్వం తరఫున ఫేవర్లు పొందిన నాగార్జున రాజశేఖరరెడ్డి చుట్టూ చిడతలు పుచ్చుకుని హరిదాసులా తిరుగుతున్నాడని ఇప్పటికే లోకం కోడై కూస్తోంది. ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడుకోవచ్చు కానీ అన్ని వర్గాల వారు చదివే వార్తా పత్రికను ఇంతగా దిగజార్చడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.
చంద్రబాబు నాయుడు "జన్మభూమి" పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పుడు తన సొంత ఊరు రామాపురంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒంటి మీద బట్టలు లేనంతగా పులకించిపోయి మాట్లాడిన చరిత్ర అక్కినేని నాగేశ్వరరావుది. ఆయన వంటి ఎంతో మంది సినీ దిగ్గజాలు కష్టపడినా చంద్రబాబు నాయుడిని రెండోసారి గట్టెక్కించుకోలేకపోయారు. ఇప్పుడు వ్యాపార ప్రయోజనాల కోసం కుటుంబసభ్యులను కాంగ్రెస్ కు అనుకూలంగా ట్యూన్ చేసి ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
రేపు పరిస్ధితులు మారి చంద్రబాబు నాయుడు మహాకూటమి అధికారంలోకి వస్తే మొదట పుష్పగుచ్చంతో చంద్రబాబు వద్ద ప్రత్యక్షమయ్యేది అక్కినేని నాగేశ్వరరావే. ఒక వారం తర్వాత నాగార్జునను కూడా ఆయన వద్దకు తీసుకెళ్ళి మరో కీర్తన పాడించే బాధ్యత కూడా నాగేశ్వరరావుదే. త్వరలో సాక్షిలో మహేష్ బాబు ఇంటర్వ్యూ పతాక శీర్షికతో వచ్చినా ఆశ్చర్యం లేదు. లబ్దిదారులూ జిందాబాద్, రాజకీయ నాయకులూ వర్ధిల్లండి.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications