జగన్ పై చర్యలు తప్పవా?

సాక్షి దినపత్రికలో, చానెల్లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంతో వైయస్ జగన్ కు వ్యతిరేకంగా అధిష్టానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఆ వార్తాకథనంతో పెల్లుబుకిన విమర్శలను వైయస్ సాక్షి మీడియా కొట్టిపారేస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో సోనియా వైయస్ జగన్ పై మరింత సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, సాక్షి మీడియా యువ నేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసుకుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమిని ఆసరాగా తీసుకుని రాహుల్ పై సాక్షి మీడియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాహుల్ మంత్రం పని చేయలేదని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి.
సాక్షి వార్తాకథనాలతో వైయస్ జగన్ కు సంబంధం లేదని, వైయస్ జగన్ కూ అధిష్టానానికీ మధ్య ఆగాధం పెంచడానికి జగన్ వ్యతిరేకులు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని వైయస్ జగన్ వర్గీయులు అంటున్నారు. అయితే జగన్ వర్గీయుల వాదనలు సోనియా తీవ్రత ముందు పని చేయడం లేదు. వైయస్ జగన్ పై తీసుకునే చర్యలపై చర్చించడానికి శనివారం ఎఐసిసి క్రమశిక్షణా సంఘం కూడా సమావేశమైందని అంటున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ పై చర్యలు తప్పవనే మాట గట్టిగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications