చంద్రబాబు అన్నమే తినరు

ఆరోగ్యానికి చంద్రబాబు చాలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. చాలా సమావేశాల్లో ఆయన ఆరోగ్య పాఠాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. రెండు గంటలపాటు యోగా, ఎక్సర్ సైజు చేస్తారు. పచ్చ సొన తీసేసిన చేసిన గుడ్డు ఆమ్లెట్ తింటారు. ఓట్స్, రాగి జావా తీసుకుంటారు. మధ్యాహ్నం రెండు, మూడు పుల్కలు మాత్రమే తింటారు. అందులో నూనె ఆనవాళ్లు లేకుండా చూసుకుంటారు. మూడు రకాల కూరగాయలు అందులో తీసుకుంటారు. అప్పుడప్పుడు ఓ కప్పు పెరుగు తింటారు.
సాయంత్రం పూట మిక్శ్చర్ తీసుకుంటారు. ఇది తప్పనిసరి. ఆ తర్వాత గ్రీన్ టీ తాగుతారు. తాను తినే ఆహారంలో ఉప్పు, కారం చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటారు. రాత్రి పూట తులసి ఆకులు వేసిన వేడినీళ్లు తాగుతారు. రోజులో మంచినీళ్లు తాగాల్సి వస్తే వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. ఇలా, చంద్రబాబు తన తిండిలో అన్నం లేకుండా చేసుకున్నారు. ఇంత తక్కువ ఆహారం తీసుకునే చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి పూనుకోవడంతో పార్టీవర్గాల్లో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications