వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 'పరామర్శ' యాత్రలు!

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అధిష్టానవర్గం తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకున్నా జగన్ తన పద్ధతిలో తాను సాగిపోతున్నారు. ఎక్కడ ఏ కాంగ్రెసు నాయకుడికి ఇబ్బంది వచ్చినా ఆయన పరామర్శ యాత్రలు చేస్తున్నారు. వైయస్ ను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంపీ హర్ష కుమార్ ను పరామర్శించడానికి జగన్ రాజమండ్రి వెళ్ళారు. ఒక నెల రోజుల పాటు ఆయన ఇదే పద్ధతిని అనుసరించనున్నట్టు తెలుస్తోంది.

మధురపూడి నుంచి కారులో రాజమండ్రి వచ్చిన జగన్ హర్షకుమార్ ఉన్న ఆస్పత్రికి వెళ్లారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులను పీసీసీ కార్యదర్శి మురళి జగన్‌ కు పరిచయం చేశారు. 'ఇతను హర్ష పెద్దకొడుకు అని చెబుతుండగా...'నాకు తెలుసు..శ్రీరాజ్' అని జగన్ చెప్పారు.

హర్షకుమార్ ‌ను పరామర్శించాక.. రోడ్డుమార్గంలో విజయవాడ చేరుకున్నారు. ఎమ్మెల్యే విష్ణు తండ్రి సుబ్బారావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ కు జగన్ వస్తున్నట్లు తెలియగానే... నకిరేకల్, నార్కెట్‌పల్లి, చిట్యాలలో ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెసు నేతలు ఏర్పాట్లు చేశారు.

'వచ్చేనెల 8వ తేదీ తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుంది. మీరు సహకరించాలి' అంటూ పార్టీ నాయకులను జగన్ కోరినట్లు తెలిసింది. విజయవాడలో విశ్రాంతి తీసుకుంటుండగా మంత్రి పార్థ సారథి, పలువురు ఎమ్మెల్యేలు జగన్‌ను కలిశారు.

వచ్చేనెల 8వ తేదీ తర్వాత తన నిర్ణయం ఉంటుందని, తనకు సహకరించాలని జగన్ కోరినట్లు సమాచారం. కృష్ణాజిల్లా ఓదార్పుకు రావాలని ఓ నేత కోరగా..'వచ్చేనెల 8 తర్వాత నిర్ణయం తీసుకుంటాను. కృష్ణా జిల్లాలో కూడా ఓదార్పు యాత్ర ఉంటుంది' అని జగన్ చెప్పినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X