వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా కాల్ తో మారిన వివేకా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేయడంతో వైయస్ జగన్ బాబాయ్, ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి మనసు మార్చుకున్నట్లు భావిస్తున్నారు. వైయస్ జగన్ తో వైయస్ వివేకానంద రెడ్డికి సయోధ్య కుదిరినట్లు మంగళవారం ఉదయం వార్తలు వచ్చాయి. సయోధ్య కుదిరినట్లు వైయస్ జగన్ మామ గంగిరెడ్డి మీడియాకు లీక్ చేశారు. గంగిరెడ్డి నివాసంలో వైయస్ జగన్ కు, వైయస్ వివేకానంద రెడ్డికి మధ్య చర్చలు జరిగాయని, ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందని వార్తలు వచ్చాయి. మంత్రి పదవి తీసుకోవడానికి వైయస్ వివేకానంద రెడ్డి విముఖత చూపారని కూడా చెప్పారు. కానీ అకస్మాత్తుగా సీన్ మారిపోయింది.

ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ ను కలవడానికి వెళ్లారు. ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా హాట్ గానే జరిగినట్లు తెలుస్తోంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైయస్ వివేకానంద రెడ్డి తాను శాశ్వతంగా రాజగకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారట. అయితే, ఆ తర్వాత వెంటనే వైయస్ వివేకానంద రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్ జగన్ తో విభేదిస్తూ కాంగ్రెసుతో ఉంటానని చెప్పడమే కాకుండా సోనియా గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు.

విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సోనియా గాంధీ వైయస్ వివేకానంద రెడ్డికి ఫోన్ చేశారని సమాచారం. ఆమె ఫోన్ తో వైయస్ వివేకానంద రెడ్డి వెంటనే ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి తన సోదరుడు వైయస్సార్ ను ప్రశంసిస్తూ ఆయన బాటలోనే కాంగ్రెసు వెంట ఉంటానని చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు తనకు తన సోదరుడు వైయస్సారే హై కమాండ్ అని, హై కమాండ్ తో తనకు నేరుగా సంబంధాలు లేవని, ఇప్పుడు తనకు నేరుగా హై కమాండ్ తో సంబంధాలు ఏర్పడ్డాయని వైయస్ వివేకానంద రెడ్డి చెప్పడాన్ని బట్టి పరిస్థితి మారడానికి గల కారణమేమిటో అర్థమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X