వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి సోనియా తాయిలం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
వైయస్ జగన్ బలహీనం కావడం చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అయినా సోనియా గాంధీని కలవడానికి ఆయనకు రెండు మూడు రోజులు పట్టేది. అసహనంతో ఆయన బెంగళూరు వచ్చి వేచి చూసిన సందర్భాలు ఎన్నో. అటువంటిది చిరంజీవికి ఆమె నిముషాల ప్రకారం అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయన కోసం వేచి ఉంది. ఇద్దరూ కలిశారు.

చిరంజీవికి రాష్ట్రంలో 18 శాతం ఓట్ బ్యాంకు ఉంది. అది వచ్చే ఎన్నికల్లో ఇంకా పెరిగే అవకాశముంది. కాపులే కాకుండా తన అభిమానులను చిరంజీవి తన ఓట్ బ్యాంకుగా మార్చుకున్నారు. రాజశేఖరరెడ్డి చాలా పవర్ ఫుల్ స్కీములు పెట్టి ప్రజల ముందుకు వెళ్ళడంతో చిరంజీవికి ఉన్న బలం సరిపోలేదు. 18 అసెంబ్లీ స్ధానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుతో కలిసే అవకాశముంది. సోనియా గాంధీ అతనికి చాలా పవర్ ఫుల్ ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుతో కలిస్తే రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయి. ఈ పరిణామం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది, వచ్చే ఎన్నికల్లోచంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికే సోనియా గాంధీ ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X