జగన్ పై రాహుల్ కు కోపమెందుకు?

కాగా, జగన్ వ్యవహార శైలే అనుమానాస్పదంగా ఉంది. పావురాలగుట్టలో జరిగిన వైయస్ స్మృతి సభలో జగన్ పార్టీ పేరును గానీ పార్టీ అధ్యక్షురాలు సోనయా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు వచ్చిన పరామర్శించిన విషయాన్ని గానీ ఆయన ప్రస్తావించలేదు. పైగా, వైయస్ శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ వర్గీయులు ప్రయత్నాలు ప్రారంభించారు. మద్దతు కోసం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వద్దకు కూడా వెళ్లారు. నిజానికి, కొంత సమయం వేచి ఉండి, అధిష్టానానికి విన్నవించుకుంటే ఫలితం ఏమైనా ఉండేదేమో.
అదలా ఉంటే, జగన్ తన ఓదార్పు యాత్రలో ఎక్కడ కూడా కాంగ్రెసు పార్టీ గురించి మాట్లాడడం లేదు. సోనియా, మన్మోహన్ సింగ్ ల పేర్లు ప్రస్తావించడం లేదు. తన తండ్రి పార్టీతోనూ ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రజాబాంధవుడుగా ఎదిగాడని, వైయస్ కు దక్కాల్సిన ఫలితమంతా తనకు దక్కాలని, కాంగ్రెసుకు దక్కకూడదనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా, జగన్ పైకి చెప్పేది ఏమైనా లోలోపల శాసనసభ్యులను కూడగట్టుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీలు చిక్కితే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి కావాలనే కోరిక జగన్ లో ఉందనేది రాహుల్ గ్రహించినట్లున్నారు.
వాటన్నింటినీ పక్కన పెడితే, ప్రధానమైన విషయమేమింటంటే - జగన్ పార్టీ పెడతారని చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. ఆ ఊహాగానాలను ఆయన ఏ సందర్భంలోనూ ఖండించలేదు. ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అడిగినా ఆయన సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి పార్టీ పెట్టాలనే ఆలోచనలోనే జగన్ ఉన్నట్లు సోనియా, రాహుల్ గాంధీ, అధిష్టానానికి చెందిన నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జగన్ ను పొమ్మనలేక, పొగ పెట్టడానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు. పార్టీ పెట్టే యోచన లేకపోతే, కాంగ్రెసుతోనే ఉండాలనుకుంటే పార్టీ పెడతారనే ప్రచారాన్ని ఆయన ఖండించి ఉండేవారనేది ముఖ్యమైన విషయంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications