జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు?

Botsa Satyanarayana
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలకు కాంగ్రెసు నాయకత్వం సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత వారిపై పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బొత్స సత్యనారాయణ కూడా వారిపై చర్యలు తీసుకునే విషయంలో పట్టుదలతో ఉన్నారు. పార్టీలోని అనిశ్చితిని తొలగించి, పార్టీని గాడిలో పెట్టడానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని, ఈ విషయంలో జాప్యం చేస్తున్న కొద్దీ పార్టీని గాడిలో పెట్టడం కూడా వెనక్కి వెళ్తూ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నలుగురు పార్టీ శాసనసభ్యులకు ప్రస్తుత స్పీకర్, అప్పటి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేసి, ఇరు వర్గాల వాదనలు విన్నారు. వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారిపై చర్యల తర్వాత మరింత మంది శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం సమావేశమైన జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఎటుండాలో తేల్చుకోవాలని, రెండు వైపులా ఉండకూడదని బొత్స సత్యనారాయణ కొంత మంది జగన్ వర్గం శాసనసభ్యులకు ఇప్పటికే సలహా ఇచ్చారు. దారికి రాని శాసనసభ్యులపై వెంట వెంట చర్యలు తీసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభ వర్షాకాలం సమావేశాల నాటికి శాసనసభ్యుల వ్యవహారం తేలిపోవాలని బొత్స సత్యనారాయణ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+