వైయస్ జగన్ ఆస్తులే అందరి టార్గెట్

దివంగత నేత వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ తీవ్రమైన అక్రమాలకు పాల్పడి పెద్ద యెత్తున సొమ్ము చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి, వైయస్ జగన్ అనతి కాలంలోనే అనూహ్యంగా ఎదిగారు. పలు సంస్థలను స్థాపించారు. పెద్ద యెత్తున సాక్షి మీడియాను ముందుకు తెచ్చారు. సాక్షి మీడియా ద్వారా చంద్రబాబుపై, కాంగ్రెసుపై తీవ్రంగా దాడి చేస్తున్నారు. సాక్షి మీడియా దాడిని తట్టుకోలేని నేతలు జగన్ అవినీతి, అక్రమాలను ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. సాక్షి మీడియాను బహిష్కరిస్తున్నట్లు వి హనుమంత రావు ప్రకటించారు. ప్రతి మీడియా సమావేశంలోనూ విహెచ్ సాక్షి మీడియా ప్రతినిధులతో వివాదానికి దిగుతూనే ఉన్నారు.
వైయస్ జగన్పై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం వెనక్కి తగ్గారు. అలా వెనక్కి తగ్గడానికి కారణాలేమిటో తెలియడం లేదు. అయితే, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు తన ఆస్తులపై చేస్తున్న ఆరోపణలపై జగన్ ఏమీ మాట్లాడడం లేదు. ఆయన వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గోనె ప్రకాశ రావు ఆ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్ ఆస్తుల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.












Click it and Unblock the Notifications