పందెంకోడి వైయస్ జగన్

జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్ను కూడా మించి పోయేలా ఉన్నాయంట. ఐపిఎల్ మ్యాచ్లపై కూడా ఇంతలా బెట్టింగులు జరగడం లేదంట! బెట్టింగులు కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా జగన్ ఆధిక్యతపై జోరుగానే బెట్టింగులు సాగుతున్నాయంట. జగన్ 2 లక్షల ఆధిక్యం సాధిస్తే, ఇంత, మూడు లక్షల ఆధిక్యం సాధిస్తే ఇంత అని బెట్టింగులు కాస్తున్నారంట.
జగన్ లక్ష మెజార్టీతో గెలిస్తే లక్షకు రెండు లక్షల రూపాయలు, కోటికి రెండు కోట్ల రూపాయల తీరులో బెట్టింగులు సాగుతున్నాయని తెలుస్తోంది. జగన్పై బెట్టింగులు ఇలా ఉంటే ఇక తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయంట. అయితే ఈ రెండు పార్టీలలో ఏది రెండవ ప్లేసులో ఉంటుందనే విషయంపై బెట్టింగులు జరుగుతున్నాయంట. దీంతో బెట్టింగకు పాల్పడుతున్న వారికి జగన్ గెలుపుపై గట్టి ధీమా ఉండటంతో పాటు, కాంగ్రెసు, టిడిపిలు గెలవడం కష్టమనే భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications