Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చర్చిలలో జగన్ భజన?

ys jagan
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మతమార్పిడులను బాగా ప్రోత్సహించారని హిందూ సంస్థలు ఆరోపించాయని చెప్పిన ఆంధ్రజ్యోతి చర్చిలలో జగన్ భజన జరుగుతుందని కూడా ఆరోపించింది. వైయస్ క్రైస్తవ పక్షపాత వైఖరి వల్ల చర్చిలకు జగన్ తన వాడయ్యారని ఆరోపించింది. జగన్ తమవాడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమించాలని కొందరు పాస్టర్లు జగన్ భజన చేస్తున్నారని ఆరోపించింది. జగన్ చేసిన అక్రమాల సంగతి పక్కన పెట్టి కేవలం తమవాడు అన్న కారణంగా ఆయనను వెనకేసుకొస్తున్నారని, జగన్‌ను అధికారంలోకి తీసుకు రావాలనే లక్ష్యంతో చర్చిలు పని చేసేంతగా వైయస్ కుటుంబం క్రైస్తవులను ప్రభావితం చేసిందని చెప్పింది.

ఆయనకు అన్యాయం జరుగుతోందంటూ ఆదివారం ప్రార్థనల్లో పలు చర్చిల్లో పాస్టర్లు భోదించడం పరిపాటిగా మారిందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇటీవల ప్రారంభించిన చర్చిలో గాస్పెల్ మినిస్ట్రీస్ దైవ సేవకుడు రంజిత్ ఓపిల్ తన ప్రసంగంలో ఏసును పక్కన పెట్టి జగన్‌ను కొనియాడారని, వైయస్‌లాంటి బలమైన నేత లేనందువల్లనే రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోందని జగన్ ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఇది జరుగుతుందని జోస్యం చెప్పారని చెప్పింది. ఇటీవల కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో క్రైస్తవ మతపెద్దలు నేరుగా ప్రచార బరిలోకి దిగారని ఆరోపించింది. అయితే ఇలా మతంలోకి రాజకీయాలను జొప్పించడం పట్ల క్రైస్తవుల నుండే విమర్శలు ఎదురవుతున్నాయని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+