సెక్స్ స్కామ్ లో చండశాసనుడు
సీతారామాంజనేయలు పంపిన మెసేజ్ల్లో లైంగికపరమైన వ్యాఖ్యానాలు ఉన్న విషయాన్ని కూడా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఎత్తి చూపింది. ఒకేసారి ఐదారుగురు అమ్మాయిలను ట్రాప్ చేయడం సీతారామాంజనేయులుకు అలవాటు అని చెప్పింది. తన మెసేజ్లకు మహిళలు లేదా అమ్మాయిలు ప్రతిస్పందించకపోతే వారి ఇళ్లకే నేరుగా వెళ్లడం సీతారామాంజనేయలు చేసే పనిగా చెప్పింది. అమ్మాయిలను ట్రాప్ చేయడానికి తన వద్ద పనిచేసే ఎస్ఐలను కూడా ఆయన వాడుతారని విమర్శించింది. ఓ లేడీ డాక్టర్ వద్దకు సీతారామాంజనేయలు వెళ్లి వేధించాడని ఆరోపించింది.
ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన తర్వాత సీతారామాంజనేయులను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడారు. దీని ప్రత్యక్ష ప్రసారాన్ని చానెల్ ప్రసారం చేసింది. రాధాకృష్ణ వేసిన ప్రశ్నలకు వేటికీ సీతారామాంజనేయులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. డయాబెటిక్ పేషెంట్గా మాత్రమే తాను డాక్టర్ వద్దకు వెళ్లానని, తనకూ డాక్టర్కూ మధ్య రోగీ డాక్టర్ సంబంధం మాత్రమే ఉందని సీతారామాంజనేయులు చెప్పారు. కార్పొరేట్ కాలేజీ లెక్చరర్ తనకు గతంలో రాఖీ కట్టిందని ఆయన చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కాగా, గతంలో ఈ విషయాలపై ఓ వ్యక్తి వేరే చానెల్ యజమాని వద్దకు వెళ్లాడని, ఆ చానెల్ యజమాని తనతో రాజీకి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీగా ఆయన తేల్చేశారు.
వల్లభనేని వంశీకి, సీతారామాంజనేయులుకు మధ్య వైరం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వంశీతో తాను గేమ్ ఆడానని, గత నాలుగు నెలలుగా ఆ గేమ్ ఆడుతున్నానని, ఇందులో భాగంగానే తాను మహిళలకు మెసేజ్లు పంపానని సీతారామాంజనేయులు బుకాయించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత నమ్రత అనే వైద్యురాలితో సీతారామాంజనేయలు లైవ్లో మాట్లాడారు. సీతారామాంజనేయులుపై ఆమె కూడా ఆరోపణలు చేశారు. మొత్తమ్మీద సీతారామాంజనేయులు చిక్కుల్లో పడినట్లే.