హంద్రీ-నీవాలో సూరికి కోట్లు
సూరి తరఫున భాను కిరణ్ ఆ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో తాను పెట్టుబడులు పెట్టినట్లు సూరి ఒక సందర్బంలో మీడియాతో చెప్పారు. జైలులో ఉన్న సూరి ఆ ప్రాజెక్టులో పెట్టుబడులు ఎలా పెట్టారో ఎవరికీ తెలియదు. అయితే, కాంట్రాక్టుల నుంచి 8 నుంచి 10 శాతం కమిషన్లను సూరి ముఠా వసూలు చేసేదని అంటున్నారు. ఆ డబ్బులతో హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లో భూములను కొనుగోలు చేసి వాటిని ఓ మహిళ పేరు మీద పెట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ మహిళ ఎవరో భానుకు ఒక్కడికే తెలుసునని అంటున్నారు.
కాగా, పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒక్కరొక్కరే హతమవుతున్నారు. 2005 జనవరి 24వ తేదీన పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులు మొద్దు శీను, పరిటాల రవి వంటి నిందితులు హతమయ్యారు. దీంతో పరిటాల రవి హత్య వాస్తవాలు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేసును మూసివేసే పరిస్థితి కూడా రావచ్చునని అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణం నుంచి సూరి హత్య కేసును విచారించాలనే ఆలోచన కూడా పోలీసులకు రావడం లేదు.