వెండి కూడా ప్రాణాలు తీస్తుందా?

హైదరాబాదు మార్కెట్లో బంగారం ధరనే కాదు, వెండి ధర కూడా విపరీతంగా పెరిగింది. శనివారం వెండి కిలో ధర ఒకేసారి 2,500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం వెండి కిలో ధర హైదరాబాదు మార్కెట్లో 72 వేల 600 పలుకుతోంది. గత కొద్ది కాలంగా వెండి ధర పెరుగుతూ ఉన్నది. దీనికి కారణం స్పష్టంగా తెలియడం లేదు గానీ బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో వెండి వైపు మధ్యతరగతి మహిళలు చూస్తుండడం ఒక కారణమని భావిస్తున్నారు. బంగారం పది గ్రాముల ధర 22,210 రూపాలు ఉంది. బంగారంతో పాటు వెండి కూడా ఇదే రీతిలో పెరుగుతూ వస్తోంది.
సాధారణంగా మహిళలు వెండి కడియాలు, వెండి పట్టగొలుసులు, వడ్డాణం ధరిస్తారు. అయితే, వెండి కంఠాభరణాలకు బంగారు పూత పూసి కూడా ధరిస్తున్నారు. వెండి ధర కూడా తక్కువేమీ కాకపోవడంతో దొంగలు మహిళలు ధరించే వెండి ఆభరణాలపై కూడా కన్నేసినట్లు భావించవచ్చు. అయితే, వెండి ధర ఇలాగే పెరుగుతుందని చెప్పలేమని, అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడం వల్ల ప్రజలు వెండిని కొనడానికి ముందుకు వస్తుండడం దాని ధర పెరగడానికి కారణమని అంటున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications