Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తవాన్ని అంగీకరించిన వైయస్ జగన్

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాన్ని అంగీకరించనట్లే అనిపిస్తోంది. వైయస్ జగన్ వెంట వెళ్లిన శానససభ్యులు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు మరోసారి మంగళవారంనాడు కూడా చెప్పారు. జగన్ వెంట వెళ్లిన శానసశభ్యుల్లో పది నుంచి 12 మంది తిరిగి కాంగ్రెసులోకి రావడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన కొద్ది మంది శాసనసభ్యులు తాము జగన్ వెంటే ఉన్నామంటూ ప్రకటనలు చేశారు. కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా వైయస్ జగన్ అంగీకరించినట్లు భావిస్తున్నారు. కావాలనే అన్నారో, అనుకోకుండా మాట జారారో తెలియదు కానీ తన వెంట శాసనసభ్యులు లేకున్నా ప్రజలున్నారని అన్నారు.

గుంటూరు జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్రను ప్రారంభించిన ఆయన బుధవారం ఆ మాటన్నారు. దీన్నిబట్టి వాస్తవం జగన్‌ గ్రహించారని అంటున్నారు. జగన్ వెంట ఉన్న ఆళ్ల నాని తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆళ్ల నాని కోరికలను అన్నింటినీ తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. ఇలా జగన్ వెంట వెళ్లిన శానససభ్యులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదనే ఉద్దేశంతో వెనక్కి రావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది శాసనసభ్యులు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాలను ఆమోదిస్తే మళ్లీ పోటీ చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్ దొరుకుతుందా లేదా, పోటీ చేసే అవకాశం దొరికితే ఖర్చులు ఎవరు భరిస్తారు వంటి సందేహాలు కొంత మంది శాసనసభ్యులను పిడిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై జగన్ ఏ విధమైన హామీ ఇవ్వకపోవడం కూడా వారిని పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, తెలంగాణలోని పలు శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే వాతావరణం నెలకొంది. తెలంగాణ శాసనసభ్యులు చేసిన రాజీనామాలను కొన్నింటిని ఆమోదించే పనిలో స్పీకర్ పడ్డారు. పార్టీలకు కూడా రాజీనామాలున చేసి ఇతర పార్టీల్లో చేరిన శాసనసభ్యుల రాజీనామాలను ఆయన ఆమోదిస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో మరిన్ని రాజీనామాలు ఆమోదం పొందే పరిస్థితి ఉంది. ఆ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చర్చ జరుగుతోంది. మంగళవారం వైయస్ జగన్‌తో కొంత మంది శాసనసభ్యులు ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి చెప్పకపోవడం వల్ల పోటీ చేసే పరిస్థితి లేదని, పోటీ చేసినా ఫలితం పెద్దగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కూడా జగన్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+