ఢిల్లీ స్థాయిలో జగన్ లాబీయింగ్?

YS Jagan
తన ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సయోధ్యకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు వినికిడి. గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన జగన్ పలువురు నాయకులతో రహస్య మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీకి సన్నిహితులైనవారితో కూడా జగన్ రహస్య చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కాంగ్రెసు అధిష్టానంపై విమర్శలను తగ్గించారు. అదే సందర్భంలో సిబిఐ దర్యాప్తులో వేగం మందగించిందనే విమర్శలు కూడా వినిపించాయి.

జగన్‌పై కాంగ్రెసు అధిష్టానానికి ఉన్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పాత్ర వహిస్తూ జగన్‌కు సమీప బంధువైన ఓ నాయకుడు అందుకు ఢిల్లీలోనే మకాం పెట్టినట్లు చెబుతున్నారు. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే నేతలతో, రాహుల్ గాంధీ కోటరీలోని యువనేతలతో ఆయన నిరంతరం మాట్లాడుతున్నట్లు సమాచారం. వైయస్ జగన్ తొందర పడ్డారని, క్షమించి వదిలేయాలని ఆయన వేడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని జగన్ ఇబ్బంది పెట్టబోరని కూడా ఆయన హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

వైయస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రజాప్రతినిధి వైయస్ జగన్ తరఫున కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో రాయబారానికి ప్రయత్నిస్తున్న నాయకుడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ విషయాన్ని పట్టించుకోవద్దని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు రాష్ట్ర నాయకులకు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానంపై గానీ, సోనియాపై గానీ ఏ మాత్రం విమర్సించకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+