55 మందితో జగన్ పక్కా ప్లాన్?

ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ వద్ద 40 మంది శాసనసభ్యులు ఉంటే సరిపోతుందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసి వస్తే ఆ బలం సరిపోతుందని ఆయన అనుకుంటున్నారు. అయితే, కనీసం 55 మంది శాసనసభ్యులను కూడగట్టి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన 60 మంది శాసనసభ్యులపై దృష్టి పెట్టారని, వారిలో 55 మంది వచ్చినా సరిపోతుందని భావిస్తున్నారని అంటున్నారు. దీనికి విరుగుడుగా అధికార కాంగ్రెసు పార్టీ ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తుందనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఏ విధమైన డోకా లేదని, అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి తీరుతామని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.
ఇంతకు ముందు ఇచ్చిన నోటీసు చెల్లకపోవడంతో తెలుగుదేశం పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును మరోసారి శనివారం ఉదయం ఇచ్చింది. తెలంగాణ అంశంపై సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు.












Click it and Unblock the Notifications