ఉద్యోగులు లేని జగన్ కంపెనీలు?

ఏయే కంపెనీలు ఏయే ఆస్తులు, నిర్మాణాలకు నిధులను వెచ్చించాయో ఆయన వెల్లడించారు. జగన్ మన రాష్ట్రంలోనే కాకుండా కర్నాటకలోనూ భారీ ఎత్తువ ఆస్తులు సేకరించారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు తదితర అభివృద్ధి చెందుతున్న, ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. స్థలాలు, భూములు, నిర్మాణాల నిమిత్తం నిధులను జగన్ గ్రూపులోకి పలు కంపెనీలు తరలించాయి. జగన్ గ్రూపుకు చెందిన 15 కంపెనీల్లో ఒక్క సండూరు పవర్ కంపెనీలో మాత్రమే 15 మంది ఉద్యోగులు ఉన్నారు.
క్లాసిక్ రియాల్టీలో ఇద్దరు ఉండగా, మిగిలిన పదమూడు కంపెనీలలో ఒక్క ఉద్యోగి కూడా లేరని తెలిపారు. 2006లో తాను జిఎంగా చేరానని, సండూరుతో పాటు దాని అనుబంధ కంపెనీలు, గ్రూపునకు చెందిన మరో 14 కంపెనీల ఖాతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను విజయ సాయి రెడ్డి సూచనల మేరకు పని చేస్తానని చెప్పారు. ఎక్కువ కంపెనీలకు వైయస్ భారతీ రెడ్డి, రమేష్ బాబులు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు.
జగన్ కూడా 2004-2009 మధ్య వివిధ సందర్భాలలో డైరెక్టర్లుగా కొనసాగారని చెప్పారు. కంపెనీల వ్యవహారాలను డైరెక్టర్లు భారతి, జగన్లే నిర్వహించే వారని చెప్పారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భూమి కొనుగోలుకు భగవత్ సన్నిధి ఎస్టేట్స్ చెల్లించిందని తెలిపారు. కర్నాటకలో భారీ ఎత్తున సేకరించారని గోపాలకృష్ణన్ మురళి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు చెప్పారని తెలుస్తోంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications