ద్రావిడ్, లక్ష్మణ్ లేని లోటు పూడుతుందా?

ఛతేశ్వర్ పుజారా ఈ ఏడాది జరిగిన ఐదు టెస్టు మ్యాచుల్లో ఆడిన తీరుతో సెలెక్టర్ల మనసులు దోచుకున్నాడు. ఐదు మ్యాచుల్లో అతను 620 పరుగులు చేశాడు. సగటు 103.33 ఉంది. ఇందులో మూడు సెంచరీలున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో పుజారా విఫలమైనప్పటికీ గత రికార్డు బాగానే ఉంది. అతను ఇంగ్లాండుతో జరిగిన మూడు మ్యాచుల్లో 404 పరుగులు చేశాడు. సగటు 134.66 ఉంది. ఈ లెక్కన చాలా మంది కన్నా అతను మెరుగ్గానే ఉన్నాడు.
విరాట్ కోహ్లీ మాత్రం నిరాశపరుస్తున్నాడు. అతని సగటు కేవలం 16.25 ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచుతో పాటు మూడు టెస్టుల్లో అతను 65 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు గత ఐదు మ్యాచుల్లో 19 మాత్రమే. ఇంగ్లాండు బౌలర్లను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడు.
కోహ్లీ సగటు ఈ క్యాలెండర్ ఇయర్లో 47,.16 ఉంది. ఎనిమిది మ్యాచుల్లో (14 ఇన్నింగ్సుల్లో) అతను 566 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. నిలకడగా ఆడుతున్నాడని భావిస్తున్న సమయంలో ఇంగ్లాండుపై సిరీస్లో కోహ్లీ మాట కూడా వినిపించడం లేదు.
టాప్ ఆర్డర్ కూడా ఘోరంగా విఫలమవుతోంది. వీరేంద్ర సెహ్వాగ్ (462 పరుగులు, 8 టెస్టులు), గౌతం గంభీర్ (403 పరుగులు, 8 టెస్టులు), సచిన్ టెండూల్కర్ (350 పరుగులు, 8 టెస్టులు), ఎంఎస్ దోనీ (348 పరుగులు, 7 టెస్టులు). టాప్ ఆర్డర్ తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో రెండో టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత బ్యాట్స్మెన్ తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ఈ స్థితిలోనే ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత స్కోరు 300 పరుగులు దాటించడం కూడా కష్టమవుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications