అత్తకు బ్రాహ్మణి అండ: తెరవెనుక పాలిటిక్స్లో చక్రం
బాబు తనయుడు, బ్రాహ్మిణి భర్త నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో వచ్చే జూన్ నుండి కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికలు మరెంతో దూరం లేనందున ఆయన పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో హెరిటేజ్ బాధ్యతలను బ్రాహ్మిణి చూసుకుంటారు. బాబు సతీమణి భువనేశ్వరి నిత్యం హెరిజేట్ కంపెనీ లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటారు.
లోకేష్ కంపెనీ వ్యవహారాలు చూసుకున్నారు. ఇప్పుడు అత్తకు తోడుగా బ్రాహ్మిణి కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారు. అయితే బ్రాహ్మిణి కేవలం హెరిటేజ్ వ్యవహారాలకే పరిమితం కాకుండా టిడిపి పైన కూడా దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ... బ్రాహ్మిణి ఈజిప్టు ఉద్యమాన్ని అధ్యయనం చేస్తోందని తెలుగు తమ్ముళ్లతో చెప్పారట.
బ్రాహ్మిణి ప్రత్యేకంగా ఈజిప్టు ఉద్యమంపై రీసెర్చ్ చేస్తోందని బాబు చెప్పడం వెనుక ఆమె రాజకీయాల్లో తెరవెనుక పార్టీకి అండగా నిలువనుందనే ఉద్ధేశ్యమే కావొచ్చునని అంటున్నారు. నారా లోకేష్ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు పార్టీకి ఎంతో ముఖ్యం. ఇలా పలు కారణాల వల్ల ఈజిప్టు ఉద్యమంపై రీసెర్చ్ చేసిన బ్రాహ్మిణి పార్టీ బలోపేతం కోసం తెరవెనుక బాబుకు, లోకేష్కు టిప్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.