పన్నీర్: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా(పిక్చర్స్)
ఓ పన్నీర్ సెల్వం.. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులో మారుమ్రోగుతుంది. కారణం అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలుకావడంతో ఆమె స్దానంలో ఓ పన్నీర్ సెల్వంను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నియమించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఓ పన్నీర్ సెల్వం రెండోసారి సీఎం కాబోతున్నారు. ఐతే ఇప్పుడు తాజాగా పన్నీర్ సెల్వం కూడా టీకొట్టు నడిపిన కుటుంబం నుంచే రావడంతో... తమిళపత్రికలు ఓ పన్నీర్ సెల్వాన్ని ప్రధాని నరేంద్రమోడీతో పోల్చుతున్నాయి.
పన్నీర్ సెల్వం 1951లో తేనీ జిల్లా పెరయకుళంలో జన్మించారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి టీ కొట్టుని నడిపారు. గతంలో ఆయన నడిపిన టీ కొట్టుని... ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యలు నడుపుతున్నారు. పన్నీర్ సెల్వం, స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.
తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు. ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల్లోనే కేబినెట్ లో కీలక మంత్రిగా ఎదిగిన పన్నీర్ సెల్వం, జయలలతకు నమ్మినబంటుగా ఎదిగారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
పన్నీర్ సెల్వం, స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
పన్నీర్ సెల్వం 1951లో తేనీ జిల్లా పెరయకుళంలో జన్మించారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి టీ కొట్టుని నడిపారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
గతంలో ఆయన నడిపిన టీ కొట్టుని... ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యలు నడుపుతున్నారు. పన్నీర్ సెల్వం, స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు వీరాభిమాని.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల్లోనే కేబినెట్ లో కీలక మంత్రిగా ఎదిగిన పన్నీర్ సెల్వం, జయలలతకు నమ్మినబంటుగా ఎదిగారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
అదే ఏడాది టాన్సీ భూముల కుంభకోణంలో సీఎం పీఠం వదలాల్సి వచ్చిన సందర్భంగా ఆమె, తనకు నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
2001 సెప్టెంబర్ నుంచి 2002 మార్చి అంటే ఆరు నెలలు పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జయలలిత జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
ఓ పన్నీర్ సెల్వం.. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులో మారుమ్రోగుతుంది. కారణం అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలుకావడంతో ఆమె స్దానంలో ఓ పన్నీర్ సెల్వంను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా జయలలిత నియమించింది.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు వచ్చిన తమిళ నటుడు ఆనంద్ రాజ్ను పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యం.
పన్నీర్ సెల్వం: టీ కొట్టు నుంచి సీఎం పీఠం దాకా
అన్నాడీఎంకే కార్యాలయం వద్ద జయలలిత అభిమానులు, కార్యకర్తలు ఆదివారం పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. డీఎంకే పార్టీ, కరుణానిధి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరుణానిధి దిష్టిబొమ్మను కొంత మంది అంత్యక్రియలు చేశారు.
అదే ఏడాది టాన్సీ భూముల కుంభకోణంలో సీఎం పీఠం వదలాల్సి వచ్చిన సందర్భంగా ఆమె, తనకు నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. 2001 సెప్టెంబర్ నుంచి 2002 మార్చి అంటే ఆరు నెలలు పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జయలలిత జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు.
2011 ఎన్నికల్లో తేనీ జిల్లా బోడీ స్దానం ఎమ్మేల్యేగా ఎన్నికై జయలలిత మంత్రివర్గంలో కీలకమైన ఆర్దక శాఖను చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా ఓ పన్నీసెల్వం రికార్డు సృష్టించారు.