Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాపై కాదు.. ఫోకస్ కేంద్రంపై పెట్టండి, శ్వేతపత్రంతో పనిలేదు: పవన్‌కు దిమ్మతిరిగే షాక్

అమరావతి: విభజన హామిల అమలుకు నోచుకోక అన్ని విధాలా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ లో.. ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయి పార్టీలు. ఇలాంటి తరుణంలో రాజకీయాలను పక్కనపెట్టి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ బయలుదేరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Recommended Video

    Pawan Kalyan Has Proposed Fact Finding Committee

    నిధుల విషయంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని లెక్కలు అడిగామని.. రెండు ప్రభుత్వాలు స్పందిస్తే ఎవరిది తప్పో కమిటీ తేలుస్తుందని అంటున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడానికి వెనుకాడుతుందన్న విమర్శలున్నాయి.

    ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని మరోసారి లేవనెత్తిన పవన్ కల్యాణ్ దానిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పవన్ డిమాండ్ సంగతి సరే, మరి బాబు మనసులో ఏముంది?

    కోర్‌కమిటీ సమావేశం:

    కోర్‌కమిటీ సమావేశం:

    కేంద్రంపై పోరాటానికి సంబంధించి మున్మందు ఎలా వ్యవహరించాలో నాయకులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం మంగళవారం తన నివాసంలో కోర్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలను, కేంద్రాన్ని ఒప్పించడంలో అనుసరించాల్సిన పంథాను గూర్చి చర్చించారు. అదే సమయంలో పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ పై కూడా స్పందించారు.

    ఫోకస్ మాపై కాదు.. కేంద్రంపై పెట్టండి..: చంద్రబాబు

    ఫోకస్ మాపై కాదు.. కేంద్రంపై పెట్టండి..: చంద్రబాబు

    పవన్‌ గతంలో పోలవరంపై శ్వేత పత్రం అడిగారు. మనం అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టాం. అసెంబ్లీలో ప్రకటించాం. వెబ్‌సైట్‌లో పెట్టాం. ఇంకా శ్వేత పత్రం అవసరం ఏముంది?.నాలుగేళ్లుగా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో నిజ నిర్ధారణ కమిటీ పరిశోధన చేయాలి.

    వచ్చినవి రాష్ట్రం ఏం చేసిందన్నది కాదు! ఇచ్చిన నిధులను ఏంచేశారన్నది కేంద్రం చూస్తూనే ఉంటుంది. కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన వాటిపై ఫోకస్‌ పెట్టాలి తప్ప రాష్ట్రంపై పెడితే వచ్చే ప్రయోజనమేమీ లేదు. అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టడానికి మనం నిత్యం సిద్ధం. దానికి వెనుకాడేది లేదు.

    అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?:

    అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?:

    కోర్ కమిటీ సమావేశంలో పోలవరంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. ఓవైపు అవసరమేముంది? అంటూనే మరోవైపు మేమెందుకు వెనుకాడుతాం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టు అర్థమవుతోంది. అంతేకాదు, ఫోకస్ అంతా కేంద్రంపై ఉండాలె తప్ప.. రాష్ట్రంపై ఉండకూడదు అంటున్నారు. అంటే, నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగకూడదు అని చంద్రబాబు పరోక్షంగా చెబుతున్నారన్నమాట.

    పవన్ నిలదీసి అడగ్గలరా?:

    పవన్ నిలదీసి అడగ్గలరా?:

    చంద్రబాబు-పవన్ కల్యాణ్ ల మధ్య అంతర్గతంగా ఏదో సఖ్యత కొనసాగుతోందన్న విమర్శ ముందు నుంచి ఉంది. అందులో నిజం లేదు అని నిరూపించుకోవాలంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందు మరో అవకాశం ఉన్నట్టే. ఒకవేళ చంద్రబాబు గనుక పోలవరంపై శ్వేతపత్రం విడుదలకు మొండికిపోతే.. పవన్ కల్యాణ్ ఆయన్ను గట్టిగా నిలదీసి అడగగలరా?.. కేంద్రాన్నే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అంత సూటిగా విమర్శించగలరా?.. అన్నవి ఇప్పుడు తెరపైకి వస్తున్న ప్రశ్నలు.

    పవన్‌కు బాబు పెద్ద ఝలకే..:

    పవన్‌కు బాబు పెద్ద ఝలకే..:

    పోలవరంపై శ్వేతపత్రం అవసరమేముంది?.. లేదా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలతో ఏం పని?, మీ ఫోకస్ కేంద్రంపై పెట్టండి లాంటి వ్యాఖ్యలు.. సమాధానం చెప్పలేక తప్పించుకుపోవడమే అన్నట్టు కనిపించడంలో అతిశయోక్తి లేదు. పవన్ స్వయంగా అడిగినా.. బాబు నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయంటే.. జనసేనానికి ఇదో పెద్ద ఝలక్ అనే చెప్పాలి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+