ఏపీపోలీస్ నివ్వెర, బాబుతో కేసీఆర్ ఇక చెడుగుడు!?
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తెరాస ప్రభుత్వ ఆదేశంతోనే తెలంగాణ పోలీసులు ఈ పని చేస్తున్నారని ఏపీ పోలీసులు అంతర్గతంగా నిర్ధారణకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై దర్యాఫ్తుకు కూడా ఆదేశించారని సమాచారం.
వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఏపీ పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండేవారు, ఆయన సన్నిహితులు, ముఖ్య అధికారులు, కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి.
ఫోన్ల ట్యాపింగ్కు అవసరమైన ఆధునిక పరికరాలను ఉమ్మడి ఏపీలోనే పోలీసు శాఖ సమకూర్చుకుంది. గతంలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఫోన్లను ఇలా ట్యాప్ చేస్తారని తాము ఊహించలేదని చెబుతున్నారు. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఉమ్మిడి రాజధాని అయినంత మాత్రాన ఇది సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై అవసరమైతే, ఆధారాలుంటే ఎంతటి వారల పైన అయినా కేసు పెట్టేందుకు ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పైన స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ప్రశ్నిస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ కేసులో చంద్రబాబు గురించి మరింత సమాచారం బయటపెట్టాలని తెరాస భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో మరికొందరి పేర్లు బయటపెట్టవచ్చునని అంటున్నారు.
ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి ఏం చెబుతారు.. తద్వారా, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెరాస భావిస్తోందని సమాచారం. ఏసీబీ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలతో టీడీపీని, చంద్రబాబును ఆడుకోవాలని తెరాస సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం.
అయితే, ఏసీబీ అధికారులకు రేవంత్ రెడ్డి ఇచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. గతంలో మైనింగ్ కేసులో నాటి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వెళ్లి సీబీఐ ప్రశ్నించింది. అలాగే ఇప్పుడు ఏసీబీ చంద్రబాబు ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
మరోవైపు, గవర్నర్ నరసింహన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నారు. జూన్ 9న ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. రేవంత్ రెడ్డి అంశం గురించి ప్రధాని, రాష్ట్రపతితో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications