దానికి అభిమాని ఫిదా: అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ 'రాజకీయం'! 2019కి హింట్ ఇచ్చారా?
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. పవన్ సినిమా అంటేనే యువతలో ఓ విధమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇక, అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Recommended Video

గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు నిరీక్షించడానికి, ఈసారికి తేడా ఉంది. ఆయన మాటలను బట్టి, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సమీప కాలంలో మరో సినిమా రాకపోవచ్చు. దీంతో అభిమానులు గతంలో కంటే భిన్నంగా వేచి చూశారు.

రాజకీయాలపై దృష్టి సారించనున్న పవన్ కళ్యాణ్
రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాలో ఏమైనా రాజకీయపరమైన డైలాగులు ఉంటాయా అనే చర్చ సాగింది. చాలామందిలోను ఈ ఉత్కంఠ కనిపించింది.

అక్కడక్కడా డైలాగులు
కానీ, సినిమాలో పెద్దగా రాజకీయపరమైన డైలాగులు లేవు. అయితే అక్కడక్కడా విసిరిన రెండు మూడు డైలాగుల్లో మాత్రం రాజకీయం దాగి ఉందని అంటున్నారు. అవి పరోక్షంగా ప్రస్తుతం ఆయన రాజకీయ ఉద్దేశ్యాన్ని చెప్పేలా ఉన్నాయి.

రెండు డైలాగులు
ఇందులో రెండు డైలాగులు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి సైకిల్ ఎక్కే డైలాగ్. రెండోది రాజ్యం మీద ఆశలేని రాజు. ఈ రెండు డైలాగులను పవన్ కళ్యాణ్ నిజ రాజకీయ జీవితానికి వర్తింప చేస్తున్నారు.

టీడీపీతో కలయికపై చర్చ సమయంలో
'వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా' అంటే సైకిల్ ఎక్కుతాడో లేదో మనల్ని మాత్రం ఎక్కకుంటే చాలు అనే డైలాగ్ ఉంది. ఇది సినిమా విడుదలకు ముందు చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చారు. 2019లో పవన్ ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఈ డైలాగ్ చర్చకు తావిచ్చింది. సైకిల్ ఎక్కుతారా అనే డైలాగ్తో పవన్ కళ్యాణ్ ఏదైనా హింట్ ఇచ్చినట్లేనా అనే చర్చ సాగుతోంది. అంటే టీడీపీతో మరోసారి కలిసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

మరో డైలాగ్కు పవన్ ఫ్యాన్ ఫిదా
దాని కంటే కీలకమైన డైలాగ్ మరొకటి ఉంది. ఈ డైలాగ్కు పవన్ అభిమానులు ఊగిపోతున్నారు. బోమన్ ఇరానీ ఓ సందర్భంలో ఓ డైలాగ్ చెబుతారు. రాజ్యం మీద ఆశలేని వాడి కంటే గొప్ప రాజు ఎవరు ఉంటారు అని అంటారు.

పవన్ నిజ జీవితంలోను
ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్కు నిజ జీవితంలోను సరిపోతుందని జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అన్నారు. తాను పదవుల కోసం, అధికారం కోసం పార్టీని స్థాపించలేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఇది పవన్ నిజ జీవితానికి సరిపోతుందని అంటున్నారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications