బ్లాక్మనీపై కఠినం: విదేశాల్లో దాస్తే ఇక్కడ జఫ్తు, జైలు
హైదారాబాద్: బ్లాక్ మనీ పైన మొదటి నుండి ఓ స్పష్టతతో ఉన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోను దానిని ప్రస్తావించింది. నల్లధనం విషయంలో బీజేపీ ప్రభుత్వం కత్తి దూస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నల్లధనంపై చర్యలు తీసుకుంటామని బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ ప్రధాని అయిన కొద్ది రోజులకే నల్లధనంపై ఓ దర్యాఫ్తు బృందాన్ని నియమించింది. ఇప్పుడు జైట్లీ నల్లధనంపై మరో కత్తి దూశారు.
నల్లధనం విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకు వస్తోంది. విదేశాల్లోని ఆస్తుల వివరాలను, వాటిపై ఆదాయాన్ని దాచినా, సదరు ఆస్తులపై పన్ను ఎగవేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇది రాజీకి వీలులేని నేరం. సెటిల్మెంట్ కమిషన్కు వెళ్లేందుకు అనుమతించరు. దీనికితోడు మూడురెట్లు పన్ను విధిస్తారు.

విదేశాల్లోని ఆస్తుల మీద వెల్లడించాని ఆధాయానికి గరిష్ఠ పన్నురేటు విధిస్తారు. రాయితీలు వర్తించవు. విదేశాల్లో ఆస్తులుండి.. రిటర్నులు దాఖలు చేయకున్నా, పూర్తి సమాచారం ఇవ్వకున్నా నేరంగా భావిస్తారు. ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.
విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి ఆదాయాన్ని దాచడం, పన్ను ఎగవేయడాలను హవాలా చట్టం కింద తీవ్ర నేరంగా పరిగణిస్తారు. రిటర్న్లలో ఆస్తులు చూపకుంటే జఫ్తు చేసే అధికారం. విదేశాల్లో జఫ్తు వీలులేకుంటే దానికి సమానమైన విలువ కలిగిన దేశీయ ఆస్తులను జఫ్తు చేసేందుకు హవాలా చట్టాన్ని సవరిస్తారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications