హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఐదేళ్లు ఉచిత విద్యుత్: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రైతులకు మరో ఐదేళ్ల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం కూడా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఐదేళ్ళలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రానున్న కాలంలో నీరు, విద్యుత్‌ ప్రధాన సమస్యగా మారనుందని, ఈ సమస్యపై అధికారులు బాగా పనిచేయాలన్నారు.

పెరుగుతున్న ధరలను కూడా నియంత్రించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు..కోస్తాలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను త్వరితగతిన ఇవ్వాలన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, ఇందిరమ్మ రెండవ దశను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వైఎస్‌ సూచించారు. హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సోమవారం ఉదయం ప్రారుంభమైన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X