మరో ఐదేళ్లు ఉచిత విద్యుత్: వైయస్
పెరుగుతున్న ధరలను కూడా నియంత్రించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు..కోస్తాలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను త్వరితగతిన ఇవ్వాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ రెండవ దశను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వైఎస్ సూచించారు. హైదరాబాద్ జూబ్లీహాల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సోమవారం ఉదయం ప్రారుంభమైన విషయం విదితమే.
Comments
Story first published: Tuesday, February 17, 2009, 13:40 [IST]