హామీని నిలబెట్టుకుంటాం: వైయస్

విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అనుకున్నామని, వర్షాలు పడి జల విద్యుత్ పెరుగుతుందని భావించామని, దాంతో ఆగస్టు నుంచి రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ అందించగలమని అనుకున్నామని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. అయితే అంత మాత్రాన హామీని నిలెబట్టుకోమని ఏమీ లేదని, డిసెంబర్ నాటికైనా రైతులకు 9 గంటలు విద్యుత్ అందిస్తామని ఆయన అన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రైతులకు 9 గంటలకు విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో తెలుగుదేశం సభ్యులు పదే పదే అడ్డం పడే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications