రూపాయి రక్తకన్నీరు: మోదీ హెచ్చరించిన మరుసటి రోజే!

దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా కుప్పకూలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా ₹95.17కి పడిపోయింది. 2026 సంవత్సరంలో రూపాయి నమోదు చేసిన అత్యంత కనిష్ట స్థాయి ఇదే కావడం గమనార్హం. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఆకాశాన్ని తాకుతున్న ముడిచమురు ధరలు, దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.

చిత్రమైన విషయం ఏమిటంటే, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక స్థితిగతులపై పౌరులను అప్రమత్తం చేసిన మరుసటి రోజే ఈ పతనం సంభవించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారతీయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ముందే ఊహించినట్లుగానే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతూ రూపాయి విలువ క్షీణించింది.

Rupee Hits Record Low At Rs 95 Per Dollar As Crude Oil Surges To 105 Dollars Amid Middle East Tensions

ముడిచమురు ధరల మంట.. డాలర్‌కు డిమాండ్!

రూపాయి పతనానికి ప్రధాన కారణం ముడిచమురు ధరలు పెరగడమే. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 4.17% పెరిగి బ్యారెల్‌కు $105.5కి చేరింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తుందనే భయాలు నెలకొన్నాయి. భారత్ తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారమై, డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రూపాయి విలువ క్రమంగా దిగజారుతోంది.

కుప్పకూలిన రూపాయి, పాతాళానికి విలువ..
కుప్పకూలిన రూపాయి, పాతాళానికి విలువ..

ట్రంప్ నిర్ణయం.. ప్రపంచ మార్కెట్ల అస్థిరత

ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం అంతర్జాతీయంగా మంటలు పుట్టించింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ, ట్రంప్ ఆ ప్రతిపాదనలను "ఆమోదయోగ్యం కాదు" అని తేల్చిచెప్పడంతో పశ్చిమాసియాలో సుదీర్ఘ పోరాటం తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్‌ను సురక్షితమైన ఆస్తిగా భావించి పెట్టుబడులు మళ్లించడంతో డాలర్ ఇండెక్స్ 98.20కి ఎగబాకింది.

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు

రూపాయి బలహీనతకు తోడు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. సోమవారం ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ 1,071 పాయింట్లు, నిఫ్టీ 305 పాయింట్లు మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 76,256 వద్ద, నిఫ్టీ 23,871 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇండియా విక్స్ (భయ సూచీ) 18 మార్కును దాటింది. ఎస్‌బీఐ, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+