లద్దాఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం

లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం కేంద్రపాలిత ప్రాంతంలో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ను ఆమోదించారు. ప్రస్తుతం లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలున్న లద్దాఖ్ లో, నుబ్రా, షామ్, ఛాంగ్తాంగ్, జాన్స్కార్, ద్రాస్‌ కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలు, దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చడానికే ఈ నిర్ణయం. 2024 ఆగస్టులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇది "అభివృద్ధి చెందిన, సంపన్నమైన లద్దాఖ్" దార్శనికతకు అనుగుణంగా ఉందని సక్సేనా తెలిపారు.

ఈ ప్రకటన లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం నివాసితుల దీర్ఘకాల డిమాండ్ నేపథ్యంలో వచ్చింది. 2019 ఆగస్టులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. లద్దాఖ్ లో శాసనసభ లేకపోవడం స్థానికులలో తమ భూమి, సహజ వనరులు, జీవనోపాధిపై భయాలు పెంచింది. ప్రాంత సాంస్కృతిక గుర్తింపు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కూడా ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన చెందుతున్నారు.

దీంతో 2022 నాటికి లద్దాఖ్ ప్రజలు నాలుగు డిమాండ్లను లేవనెత్తారు. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ, లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక లోక్‌సభ స్థానాలు, లద్దాఖ్ కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో కూడిన నియామక ప్రక్రియ ఏర్పాటు. ప్రస్తుతం లద్దాఖ్ కు ఒకే లోక్‌ సభ స్థానం ఉంది. ఆరో షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు భూమి రక్షణ, స్వయంప్రతిపత్తిని హామీ ఇస్తుంది. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వంటి సంస్థలు 2020 నుంచి డిమాండ్లను ముందుకు తీసుకెళ్తూ నిరసనలు నిర్వహిస్తున్నాయి.

2024, 2025లలో కొత్త నిరసనలు, కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష, కేంద్ర ప్రభుత్వంతో చర్చల పునరుద్ధరణ వంటివాటితో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. గత సెప్టెంబర్‌లో లేహ్‌ లో నిరసనలు హింసాత్మకంగా మారి, భద్రతా దళాలతో ఘర్షణల్లో నలుగురు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఘటన అనంతరం వాంగ్‌ చుక్ నిరాహార దీక్ష విరమించుకొని శాంతిని కోరారు. అయితే, అశాంతి ప్రేరేపించడంలో అతని ప్రమేయం ఉందని కేంద్రం ఆరోపించి, జాతీయ భద్రతా చట్టం కింద ఐదు నెలలకు పైగా జైలులో ఉంచింది. మార్చిలో ప్రభుత్వం అతని నిర్బంధాన్ని రద్దు చేసింది. దీని లక్ష్యం "లద్దాఖ్ లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం వాతావరణాన్ని ప్రోత్సహించడం, తద్వారా అందరితో నిర్మాణాత్మక సంభాషణను సులభతరం చేయడం" అని వివరించింది.

Ladakh Lieutenant Governor VK Saxena Approves Creation of Five New Districts in Union Territory

విడుదలయ్యాక.. వాంగ్‌ చుక్ కేంద్ర ప్రభుత్వంతో "విన్-విన్" సంభాషణకు పిలుపునిచ్చారు. అతని నిర్బంధ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ నాయకత్వం మధ్య నిలిచిపోయిన అధికారిక చర్చలు మే 22న తిరిగి ప్రారంభమవుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదివారం ప్రకటించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+