AI వరమా ? శాపమా ? యువతకు పోప్ లియో వార్నింగ్..!
ఈ రోజుల్లో కృత్రిమ మేథ (AI)లేని ప్రపంచాన్ని ఊహించలేని పరిస్ధితి. ఎక్కడ చూసినా కృత్రిమ మేథ అన్ని రంగాల్లోనూ దూసుకొచ్చేస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేథ వల్ల కలిగే లాభాలు, నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా అంతకు మించిన చర్చలే జరుగుతున్నాయి. దీనిపై తాజాగా పోప్ బాధ్యతలు చేపట్టిన లియో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా జరిగిన రెండవ రోమ్ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి పోప్ లియో ప్రసంగించారు. ఇందులో ఆయన ఏఐ కంటెంట్ కు అతిగా అలవాటు పడటం వల్ల యువత వాస్తవికతను అర్థం చేసుకునే, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ఎలా కోల్పోతుందో ఆయన వెల్లడించారు. పిల్లలు, యువకుల, వారి మేధో, నాడీ అభివృద్ధిపై ఏఐ వాడకంతో కలిగే పరిణామాల పట్ల అందరూ ఆందోళన చెందుతున్నట్లు పోప్ తెలిపారు.

మే 8న పోప్ గా ఎన్నిక తర్వాత పోప్ లియో తరచుగా ఏఐపై ఫోకస్ పెట్టారు. ఏఐ సృష్టించిన భారీ డేటాను ఫిల్టర్ చేయకుండా నిరంతరం వాడటం వల్ల నిజమైన మేధస్సు లేదా జ్ఞానం గందరగోళంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.ఏఐ ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారానికి ఇంత త్వరగా యాక్సెస్ ఏ తరానికీ లభించలేదని, కానీ డేటా ఎంత విస్తృతంగా ఉన్నా, దానిని మనిషి తెలివితేటలతో పోల్చకూడదని పోప్ హెచ్చరించారు.
ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడంలో ఏఐ పాత్రను అంగీకరిస్తూనే, ఈ ప్రయోజనాలను మానవాళి సామర్థ్యాలను దెబ్బతీసే అంశాలతో పోల్చి చూడాలని పోప్ కోరారు. పోప్ లియో స్వయంగా ఏఐ దుర్వినియోగానికి బాధితుడిగా మారారు. తాజాగా పోప్ డీప్ఫేక్ వీడియోలు, ఆడియో సందేశాలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. దర్యాప్తులో ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో పోప్ స్వరాన్ని అనుకరిస్తూ యూట్యూబ్ , టిక్టాక్లలో డజన్ల కొద్దీ ఏఐ-జనరేటెడ్ క్లిప్లు వెలుగుచూశాయి.

ఈ నేపథ్యంలో పోప్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం నిర్వహించిన సర్వేలో వార్తల ముఖ్యాంశాలు, అప్ డేట్స్ తెలుసుకోవడానికి యువ వినియోగదారులు ఇప్పుడు ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారని తేలింది. దీంతో యువ ప్రేక్షకులు ఈ డిజిటల్ యుగంలో సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. అలాగే కాథలిక్ చర్చి కొత్త టెక్నాలజీల చుట్టూ నైతిక చర్చలు చేపడుతోంది. పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో వాటికన్ 2020లో రోమ్ కాల్ ఫర్ ఏఐ ఎథిక్స్ను ప్రారంభించింది. దీనిని మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు, ఐక్యరాజ్యసమితి, విద్యాసంస్థలు కూడా ఆమోదించాయి. ఇప్పుడు పోప్ కూడా హెచ్చరికలు చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications