పార్టీ ఫిరాయించిన వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలన్న జగన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
అమరావతి : వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ సమావేశమైంది. గురువారం అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు తనతో టచ్లో ఉన్నారని, తాను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని అన్నారు.
అన్యాయమైన ఈ సంప్రదాయాన్ని తాను ఎన్నటికీ ఆచరించనని సీఎం జగన్ స్పష్టం చేశారు. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరు పార్టీ మారినా మరో ఆలోచనలేకుండా వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ స్పీకర్ను కోరారు. వైసీపీలో చేరాలనుకునే వారితో ముందుగా రాజీనామా చేయించిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు.

టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ అనైతికంగా వైసీపీలో చేర్చుకోబోమని జగన్ స్పష్టంచేశారు. పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలన్న జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications