చంద్రబాబు తీరుతో ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైపోయిందన్నకేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : ఈవీఎంల విషయంలో చంద్రబాబు హడావిడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఈవీఎంలతోనే గెలిచిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
2014 లో చంద్రబాబు ఈవీఎంల తో జరిగిన ఎన్నికల్లో గెలవలేదా : కేటీఆర్
ఈవీఎంల విషయంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి, ఆయనలో నెలకొన్న ఆందోళన చూసి ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు కేటీఆర్. టెక్నాలజీకి తనవల్లే వచ్చిందని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈవీఎంల విషయంలో రచ్చ చేస్తున్న చంద్రబాబు ఒకవేళ గెలిస్తే అప్పుడు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. మొత్తమ్మీద చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి ఏపీ ప్రజలకు గెలుపెవరిదో అర్థమైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.