కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకక రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలవడంపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : తెలంగాణలో రెవెన్యూ శాఖ విలీనం, రద్దు వార్తల నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుందామనుకున్న రెవెన్యూ ఉద్యోగులకు అపాయింట్ దొరకలేదు. దీంతో వారంతా చినజీయర్ స్వామిని ఆశ్రయించారు. సమస్య వివరించి తమను గట్టెక్కించాలని కోరారు.
రెవెన్యూ శాఖను రద్దుచేస్తామని సీఎం కేసీఆర్ అంటుండటంతో గత పదిరోజులుగా ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు సతీష్ నేతృత్వంలో ఉద్యోగులు సీఎంను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో శంషాబాద్కు చేరుకున్న ఉద్యోగ సంఘం నేతలు ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు.

సమస్యను సావధానంగా విన్న చినజీయర్ వారికి అభయం ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. సమస్య తన దృష్టికి వచ్చినందున ఇక ఎలాంటి ఇబ్బందులు రావని స్వామీజీ చెప్పినట్లు వివరించారు. కేసీఆర్ పాలనపై ఇప్పటికే పలు విమర్శలు ఉండటం, తాజాగా రెవెన్యూ ఉద్యోగులు సీఎం అపాయింట్మెంట్ దొరకక చినజీయర్ను ఆశ్రయించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications