AP DSC 2024: ఎన్నికల తర్వాతే ఏపీ డీఎస్సీ ? కొత్త షెడ్యూల్ ఆలస్యంతో..
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నాలుగేళ్లుగా మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటన చేసింది. కేవలం 50 రోజుల వ్యవధిలో టెట్, డీఎస్సీ పరీక్షలు పూర్తి చేయాలని భావించింది. కానీ టెట్ పరీక్షలకూ, డీఎస్సీ పరీక్షలకూ మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్న సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ఆధారంగా అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించి షెడ్యూల్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి.
హైకోర్టు తీర్పు తర్వాత డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిగా మౌనం వహించడం అభ్యర్ధుల్లో టెన్షన్ పెంచుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ మార్చి 14న టెట్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో 15 నుంచి పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ షెడ్యూల్ రద్దయింది. కాబట్టి టెట్ పరీక్షల ఫలితాలు వెలువడే మార్చి 14 తర్వాత నెల రోజుల గ్యాప్ ఇచ్చి డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు.

మరో ఐదు రోజుల్లో టెట్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా జరిగినా డీఎస్సీ పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించే సరికి మే నెల వచ్చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విద్యాశాఖ ఓ క్లారిటీ ఇవ్వబోతోంది.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications