CBSE Exams: ఇక ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు-ఎప్పటి నుంచో తెలుసా ?
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లోనూ మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తున్న బోర్డు పరీక్షల్ని ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ)ని కేంద్రం ఆదేశించింది. దీంతో సీబీఎస్ఈ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.
2025 నుంచి అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు వీలుగా విద్యావిధానంలో మార్పులు చేయాలని బోర్డును కేంద్రం కోరింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి పీలుగా సీబీఎస్ఈ స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ, సీబీఎస్ఈ అధికారులు చర్చలు జరపబోతున్నారు. ఇందులో వారికి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు ఎలా నిర్వహించాలో స్పష్టత ఇవ్వనున్నారు.

ప్రస్తుతం, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ షెడ్యూల్పై ప్రభావం చూపకుండా మరో సెట్ బోర్డ్ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ను ఎలా రూపొందించాలి అనే పద్ధతులను బోర్డు రూపొందిస్తోంది. బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు ఎలా నిర్వహించాలో లాజిస్టిక్స్పై పని చేయాలని మంత్రిత్వ శాఖ సీబీఎస్ఈని కోరింది. ఈ మేరకు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications