జననాయగన్ ట్విస్ట్: సారీ.. పూజా హెగ్డే!
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి సినిమా.. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జననాయగన్' జులై 23న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉడటంతో ఈ సినిమా ప్రీ-బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో ఇప్పటికీ భారీ అభిమాన గణం ఏర్పడటంతో.. చాలా మంది కోలీవుడ్ ప్రేక్షకులు 'జన నాయగన్'లో పూజా హెగ్డే నటనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాలో పూజా హెగ్డేకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందని.. ఈ విషయం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుందని దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జననాయగన్ సినిమాలో పూజా హెగ్డే ఓ ప్రెస్ రిపోర్టర్గా నటిస్తున్నారని.. అయితే ఆ సినిమాలో ఆమెకు ఎక్కువ సీన్స్ లేవని డైరెక్టర్ తెలిపారు. ఆమెకు తగినంత స్క్రీన్ స్పేస్ ఇవ్వనందుకు ఆయన ఆ ఇంటర్వ్యూలో పూజా హెగ్డేకు క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాకుండా తాను మొదట స్క్రిప్ట్ రాసినప్పుడు పూజా హెగ్డేకు చాలా ఎక్కువ సీన్స్ ఉండేవని ఆయన పేర్కొన్నారు. అయితే నిడివి పరిమితుల కారణంగా ఆయన ఆమె సన్నివేశాలలో కొన్నింటిని కట్ చేయాల్సి వచ్చింది.

ఈ విషయం బయటపడటంతో సోషల్ మీడియాలో చాలా మంది పూజా హెగ్డే ' బీస్ట్', 'రెట్రో' సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ.. ృఆ రెండు చిత్రాలు ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, ఆమె నటన ఎవరిని ఆకట్టుకోలేదని కామెంట్లు చేస్తున్నారు. జననాయగన్ సినిమా కోసం పూజా హెగ్డేను తీసుకున్నప్పుడు, కనీసం ఆ సినిమాతో కోలీవుడ్లో ఆమెకు ఓ బ్రేక్త్రూ వస్తుందని అందరూ ఆశించారని వారు అంటున్నారు. కానీ డైరెక్టర్ హెచ్. వినోద్ వెల్లడించిన విషయం తర్వాత ఆ సినిమాలో ఆమెకు ఆ అవకాశం లేదని అర్థమైంది. అందువల్ల కోలీవుడ్లో ప్రముఖ నటిగా ఎదగడానికి పూజా హెగ్డేకు ఏదీ అనుకూలంగా లేదని ఆమె అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
చివరికి 'జననాయగన్' బ్లాక్బస్టర్ విజయం సాధిస్తుందా లేదా.. ఈ సినిమా విడుదల తర్వాత పూజా హెగ్డే కోలీవుడ్ పరిశ్రమలో ఓ మంచి భవిష్యత్తు ఉన్న నటిగా ఎదగడానికి ఆమె పరిమిత సీన్స్ ఆశించిన ప్రభావాన్ని చూపుతాయా లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications