పేరు మార్చుకున్న మెగాహీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి: అన్నీ సంచలనాలే!!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన తన పేరును మార్చుకున్నారు. తనకు కొత్త పేరు పెట్టుకున్న సాయిధరమ్ తేజ్ తన తల్లి ఎప్పుడు తనతో పాటు ఉండాలని, తన పేరులో తన తల్లి పేరును చేర్చుకున్నారు. మార్చి 8న తన తల్లి దుర్గ పేరును తీసుకొని సాయి దుర్గ తేజ్ గా సరికొత్తగా నామకరణం చేసుకున్నారు.
అలాగే తన తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించానని ఆయన వెల్లడించారు. దుర్గ ప్రొడక్షన్ బ్యానర్ మీద భవిష్యత్తులో పని చేయబోతున్నట్లు సాయి దుర్గా తేజ్ వెల్లడించారు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిం స్పెషల్ షో ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో మీడియాకు ప్రదర్శించారు.

నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వలో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం తన తల్లి పేరు మీద ప్రారంభించిన దుర్గా ప్రొడక్షన్ బ్యానర్ మీదనే తెరకెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన ఆయన మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మెగా హీరో మొన్ననే పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబు గారితో సినిమా చేశాను. ఇక నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి గారే అంటూ పేర్కొన్నారు. ముందు మా చిరుమామతో సినిమా చేసిన తర్వాత తర్వాత మిగతా వాళ్లతో మల్టీస్టారర్ చేస్తా అన్నారు మెగామేనల్లుడు సాయి దుర్గ తేజ్.
ఇక అంతే కాదు గాంజా శంకర్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వ్యంగంగా స్పందించారు. గాంజా శంకర్ సినిమా ఉందా? ఆగిపోయిందా? అని అడిగిన ప్రశ్నకు, ఓ వెబ్సైట్లో ఆగిపోయింది అన్ని వార్త చూసిన తర్వాతే నాక్కూడా తెలిసిందని , ఇక సినిమా ఉందా లేదా అనేది ఆ వెబ్సైట్ వాళ్ళు చెప్తే కానీ తెలీదని సాయి దుర్గా తేజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తంగా మెగా హీరో చెప్పిన సంచలన విషయాలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications