Nayanthara: భర్తకు షాకిచ్చిన నయనతార..!
నయనతార.. టాలీవుడ్, కోలీవుడ్ మంచి నటురాలిగా పేరు తెచ్చుకున్నారు. నయనతార హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగారనే చెప్పొచ్చు. అప్పట్లో నయనతార, శంభు ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. నయనతార, శంభు జంట విడిపోయింది. ఆ తర్వాత నయనతార పెళ్లైన కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవ ప్రేమలో పడింది. ప్రభుదేవ నయతారను పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది.
అప్పటికై పెళ్లైన ప్రభుదేవ.. నయనతార కోసం తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. ప్రభుదేవ, నయనతార విడిపోయారు. నయనతార కొద్ది రోజలు తర్వాత తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడ్డారు. నయనతార ఎట్టకేలకు గత సంవత్సరం జూన్ లో విఘ్నేశ్ శివన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. వారి పిల్లలకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

నయనతార సంవత్సరం క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఆమె భర్త విఘ్నేశ్ శివన్(విక్కీ)ని ఫాలో అవుతూ వస్తున్నారు. తాజాగా నయనతార తన భర్తను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దీంతో ఇది చర్ఛనీయంశంగా మారింది. అన్ ఫాలో కొట్టడమే కాదు." కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు" అంటూ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేసింది.

దీంతో విఘ్నేశ్ శివన్, నయనతారకు మధ్య ఏదో జరగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే ఆమె అనుకోకుండా అన్ ఫాలో కొట్టిందా.. కావాలనే కొట్టిందా అనే చర్చ మొదలు కాగానే.. నయనతార తన భర్తను మళ్లీ ఫాలో చేసింది. దీంతో పొరపాటను అన్ ఫాలో కొట్టినట్లు భావిస్తున్నారు. కాగా.. నయనతార ప్రస్తుతం టెస్ట్ సినిమాలో చేస్తోంది. నయనతార నటించిన జవాన్ మూవీ భారీ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications