Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యంగ్ టైగర్, కాంతార హీరో, సలార్ డైరెక్టర్ తో ప్లాన్, కేజీఎఫ్ నిర్మాత, ఏం జరుగుతోంది ?

హోంబలే ఫిల్మ్స్ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. భాష హద్దులు దాటి పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు ఇప్పుడు స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ లాంటి సినిమాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే జూనియర్ ఎన్టీఆర్, కాంతార సినిమా హీరో, ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి, సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకే చోట ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కాంతార సినిమాకు దర్శకత్వం వహించి ఆ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి, సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. రిషబ్ శెట్టి-తారక్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు కలుసుకున్నారు ? అని పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు.

Photos of Junior NTR Rishabh Shetty and Prashant Neel together have gone viral on social media
ముగ్గురు ప్రముఖులు ఒకే చోట ఎందుకు కలుసుకున్నారు, వీళ్లు ఎక్కడికి వెళ్లారు?, వాటికి గల కారణాలపై కూడా పలు చర్చలకు దారితీసింది. కేజీఎఫ్, సలార్ లాంటి సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ నివాసం ఉంటున్న బెంగళూరులోని ఆయన ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతితో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాల నిర్మాత విజయ్ కిరంగదూర్ సహా పలువురు పాల్గొన్నారు.

బెంగళూరులోని ప్రశాంత్ నీల్ ఇంట్లో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తారక్ తదుపరి చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబాలే సంస్థ నిర్మిస్తున్న సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాలార్-2 చిత్రం పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌ను హోంబలే సంస్థ నిర్మిస్తోంది. ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న సయంలోనే బెంగళూరులోని ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వీళ్లు హాజరైనారు.

జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హోంబాలే సంస్ధ నిర్మాత విజయ్ కిరంగదూర్ కొత్త సినిమా నిర్మిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తారక్. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కొత్త సినిమా విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్, లిఖితా నీల్, తారక్, ఆయన సతీమణి ప్రణతితో కలిసి జంటలుగా కలిసి తీసుకున్న ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.\

Photos of Junior NTR Rishabh Shetty and Prashant Neel together have gone viral on social media

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తరువాతే అంటే సలార్ కు ముందే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసారు. కొన్ని కారణాల వల్ల ఆసినిమా ఆలస్యం అవుతోంది. దేవర', వార్ 2' చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ నీల్‌ దర్శకత్వంలో నటించనున్నారు. సాలార్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాలో నటించే అవకాశం ఉంది.

రిషబ్ శెట్టి కాంతార సక్సెస్ వేవ్‌లో దూసుకుపోతున్నాడు. కాంతార 2 కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇక ఐదేళ్లలో సినిమా రంగంలో 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు హోంబాలే సంస్థ నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రకటించారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా హోంబాలే సంస్థ సినిమాలను నిర్మిస్తోంది. త్వరలో రిచర్డ్ ఆంటోనీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+