తెలుగు హీరో మోసం చేశాడంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆత్మహత్య యత్నం ఘటన తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన లోకేష్ అనే యువకుడు.. "జెట్టి" సినిమా హీరో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కాగా లోకేష్ రాసిన లేఖలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు..
సినీ నటుడు మాన్యం మురళీకృష్ణ పేరును ప్రస్తావిస్తూ, రైల్వే కాంట్రాక్ట్ పేరుతో తనను నమ్మబలికి భారీగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించాడు. బంధువుల ద్వారా మొత్తం రూ.3.15 కోట్లు సమకూర్చి ఇచ్చినట్లు తన లేఖలో పేర్కొన్నాడు. డబ్బులు సమకూర్చేందుకు తాను తన ఇల్లు తాకట్టు పెట్టడంతో పాటు బంధువుల దగ్గర అప్పులు చేశానని లోకేష్ పేర్కొన్నాడు. ఇంత మొత్తాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి పని జరగకపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురయ్యానని తన లేఖలో వాపోయాడు. అంతే కాకుండా తన పరిస్థితి దయనీయంగా మారిన తర్వాత కనీసం ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.20 లక్షలు సహాయం చేయమని అడిగినా, పట్టించుకోలేదని లోకేష్ ఆరోపించాడు. ఈ నిర్లక్ష్యం తనను తీవ్ర నిరాశలోకి నెట్టిందని పేర్కొన్నాడు.

సదరు లెటర్ లో.. "అమ్మానాన్న క్షమించండి" అంటూ భావోద్వేగంగా ప్రారంభమైన లేఖలో, తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని అధికారులను, సమాజాన్ని కోరాడు. తన కుటుంబం అప్పుల భారంతో కష్టాల్లో పడకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. లోకేష్ ఆరోపణలపై వాస్తవాలు వెలికితీయడానికి సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించారు.
ఇక నందితా శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'జెట్టి' (2022) మత్స్యకారుల జీవిత నేపథ్యంతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం [Aha (ఆహా)] ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) March 28, 2026
అమ్మానాన్న క్షమించండి..
జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు లోకేష్ ఆత్మహత్యాయత్నం
హీరో మాన్యం మురళీకృష్ణకు రూ.3.15 కోట్లు బంధువుల ద్వారా ఇప్పించానని
రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి… pic.twitter.com/mYGIpHyMEz
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మరో సూపర్ కాన్సెప్ట్తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..!












Click it and Unblock the Notifications