ఈ చిన్నారిని ఆదుకుందాం
హైదరాబాద్:అందరి కళ్లూ సచిన్ టెండూల్కర్పైనేఉన్నాయి. వెస్ట్ జోన్కు నాయకత్వంవహిస్తున్న టెండూల్కర్ గత కొంతకాలంగా టెన్నిస్ ఎల్బోతోబాధపడుతున్నాడు. పాక్ భారతపర్యటన దృష్ట్యా ఆ సిరీస్లో సచిన్ ఉంటాడా,లేడా అనే సందేహాలువ్యక్తమవుతున్న తరుణంలోహైదరాబాద్లో టెండూల్కర్నాయకత్వంలోని వెస్ట్ జోన్ రాహుల్ద్రావిడ్ నేతృత్వంలోని సౌత్ జోన్తోతలపడుతోంది. అయితే తాను పాక్తోజరిగే సిరీస్లో ఆడటం ఖాయమని సచిన్స్పష్టం చేశాడు. తప్పకుండా ఆడాలనితనపై బిసిసి ఐ ఒత్తిడి ఏమీ లేదని ఆయనవిలేకరులతో చెప్పాడు.హైదరాబాద్లోనిఉప్పల్ ప్రాంతంలో కొత్తగానిర్మాణమైన విశాఖ అంతర్జాతీయక్రికెట్ స్టేడియంలో రేపటి నుంచిదులీప్ ట్రోఫీ మ్యాచ్లో తలపడేందుకువెస్ట్, సౌత్ జోన్లుసిద్ధమవుతున్నాయి. ప్రధానమైనఆటగాళ్లు పాల్గొంటున్న దృష్ట్యా ఈ పోటీపైఆసక్తి నెలకొంది. సచిన్ నాయకత్వంవహిస్తున్న వెస్ట్ జోన్ జట్టులోని బౌలర్లుఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్లు కూడాగత కొంత కాలంగా గాయాలతోబాధపడుతున్నారు.పాకిస్థాన్తోఅతి పెద్ద సిరీస్ ఉన్న నేపథ్యంలో ఈమ్యాచ్ యువకులకు అతి ప్రధానమైనఅవకాశమని, తమలాంటివారికిప్రాక్టీస్ మ్యాచ్ అని సచిన్ టెండూల్కర్అన్నాడు. ఇది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అని,మామూలుగా తీసుకోవడానికి వీల్లేదని,యువకులు దీన్ని బాగా వాడుకోవడాల్సిఉన్నదని ఆయన అన్నాడు.రాహుల్ద్రావిడ్ నేతృత్వంలోని ప్రత్యర్థి జట్టు బలం,బలహీనత ఏమిటనేది తను ఆలోచించడంలేదని, తాను పెర్ఫార్మెన్స్ గురించిఆలోచిస్తున్నానని, అత్యుత్తమంగా ఆడటానికిప్రయత్నిస్తామని ఆయన చెప్పాడు.సౌత్జోన్ జట్టులో హైదరాబాద్ స్టయిలిష్బ్యాట్స్మెన్ వివియస్ లక్ష్మణ్, ఆంధ్రఆటగాడు వేణుగోపాలరావు ఉన్నారు.ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగారాణిస్తున్న వేణుగోపాల రావుకు ఈమ్యాచ్ మంచి అవకాశం.












Click it and Unblock the Notifications