వర్మ 'రియల్' రౌడీలు

అందుకే రక్త చరిత్ర తరువాత మరో చిత్రానికి ఆయన సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పండు హత్య నేపథ్యంలో వర్మ బెజవాడ రౌడీలు అనే కొత్త చిత్రాన్ని తీయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రాజకీయనాయకులు వంగవీటి రంగా, పండు, ఆయన్ను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డితో పాటు మరికొందరు విజయవాడకు పలువురు రాజకీయ నాయకుల నేపథ్యంలో చిత్రాన్ని తీస్తానని ప్రకటించడమే కాకుండా అందులో నటీనటుల కోసం సెర్చింగ్ కూడా అప్పుడే ప్రారంభించాడు. విజయవాడలో చెలరేగిన ఫ్యాక్షన్ ను చిత్రం ద్వారా చూపిస్తానని ఆయన చెప్పటంపై విజయవాడ రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ మీడియాలో ఎక్కడం కోసం ఇలాంటివి చేస్తుంటాడని, తమ నాయకులను వ్యతిరేకంగా సినిమాలు తీస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
తెలుగుదేశం నాయకుడు పరిటాల రవీంద్రపై వర్మ తీస్తున్న రక్త చరిత్ర ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. రవీంద్ర భార్య పరిటాల సునీతకు ఆ చిత్రాన్ని చూపించిన తర్వాతనే విడుదల చేయాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఆయన తన చిత్రాల్లో రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకొని మీడియాకు ఎక్కి ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నట్టు కొందరు ఆరోపిస్తుంటారు. చాలామంది దర్శకులు చిత్రాలు తీస్తుంటారు. కాని వర్మ చిత్రాలు మాత్రమే వివాదాస్పదం కావటానికి కారణం అయన ఎంచుకున్న నేపథ్యమే కారణమని రాజకీయ నాయకులు చెబుతుంటారు. అందులో ఎవరో ఒక వర్గం వారిని లేదా రెండు వర్గాల వారిని చెడుగా చూపించాలి. దీంతో వర్మ చిత్రాలపై రాజకీయ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు.












Click it and Unblock the Notifications