డయాబెటీస్ ఉందా? సెల్ ఫోన్ వాడకం అధికం చేయండి!!
మొబైల్ హెల్త్ టెక్నాలజీని సైంటిఫిక్ గా పరిశీలించటంలో ఇది మొదటి అధ్యయనం. ఒక వ్యక్తి రక్తంలోని హేమోగ్లోబిన్ ద్వారా బ్లడ్ షుగర్ నిర్ధారిస్తారు. మొబైల్ హెల్త్ సాఫ్ట్ వేర్ సుమారు సంవత్సరంనుండి వాడుతున్న డయాబెటీస్ రోగులకు హెమోగ్లోబిన్ ఎఎల్సి సగటున సుమారు 1.9 శాతం తగ్గినట్లు స్టడీ తెలుపుతోంది. ఈ ఫలితాలు మరిన్ని దీర్ఘ రోగాలకు సంబంధించిన అంశాలకు కూడా దోహదం చేయనున్నాయి. ఫలితాలు ఆసక్తి కరంగా వున్నాయని మేరీ ల్యాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ ప్రిన్సిపాల్ ఇన్వెస్స్టిగేటర్ ఛార్లీన్ సి. క్విన్ తెలుపుతున్నారు.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆధునిక ఇతర కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా రోగులకు ఏ రకమైన ప్రయోజనాలు కలిగించవచ్చనే అంశం పై స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ ఫలితాలు త్వరలోనే తమ రోగుల అనారోగ్యాన్ని దూరం చేయటానికి డాక్టర్లకు సైతం అందుబాటులోకి రాగలవని కూడా రీసెర్చర్లు భావిస్తున్నారు.