కామన్వెల్త్ విజేతలకు ఘనస్వాగతం(పిక్చర్స్)
హైదరాబాద్: గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి నగరానికి చేరుకున్న విజేతలకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
గత టోర్నీలో కాంస్యం నెగ్గిన తాను ఈసారి అంతకంటే బాగా రాణిస్తానని ఊహించలేదని తెలిపాడు. అయితే ఖచ్చితంగా పతకం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లానని చెప్పాడు. బంగారు పతకం సాధించడం మాత్రం ప్రత్యేక అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు.
కశ్యప్ తోపాటు కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన పివి సింధు, గురుసాయిదత్, కోచ్ గోపీచంద్తో కలిసి నగరానికి చేరుకున్నారు. వారికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. తన శిశ్యులు సాధించిన విజయాల పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. కశ్యప్ గెలుపు భారతదేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డామని తెలిపిన గోపీచంద్.. కశ్యప్ ఎంతగానో మెరుగయ్యాడని చెప్పారు. స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ తమ తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే కాంస్యం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని పివి సింధు, గురుసాయి దత్ తెలిపారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం నుంచి పతకాలు సాధించిన క్రీడాకారులకు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

ఘనస్వాగతం
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి నగరానికి చేరుకున్న విజేతలకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

ఘనస్వాగతం
ఈ సందర్భంగా హైదరాబాద్ ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

ఘనస్వాగతం
గత టోర్నీలో కాంస్యం నెగ్గిన తాను ఈసారి అంతకంటే బాగా రాణిస్తానని ఊహించలేదని కశ్యప్ తెలిపాడు.

ఘనస్వాగతం
అయితే ఖచ్చితంగా పతకం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లానని కశ్యప్ చెప్పాడు.

ఘనస్వాగతం
బంగారు పతకం సాధించడం మాత్రం ప్రత్యేక అనుభూతినిచ్చిందని పారుపల్లి కశ్యప్ పేర్కొన్నాడు.

ఘనస్వాగతం
కశ్యప్ తోపాటు కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన పివి సింధు, గురుసాయిదత్, కోచ్ గోపీచంద్తో కలిసి నగరానికి చేరుకున్నారు.
Image source: www.facebook.com/OdelaMallanna

ఘనస్వాగతం
తన శిశ్యులు సాధించిన విజయాల పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. కశ్యప్ గెలుపు భారతదేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు.

ఘనస్వాగతం
స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ తమ తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే కాంస్యం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని పివి సింధు, గురుసాయి దత్ తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications