భారత్ అంటే మసరత్ ఆలంకు అసహ్యం!
కరుడు గట్టిన వేర్పాటువాది మసరత్ ఆలంకు (42) భారతదేశం అన్నా, భారత ప్రజలు అన్నా సహించడు. వారిని చూస్తే అతనికి శరీరం మీద జర్రులు పాకినట్లు ఉంటుంది. భారత్ వ్యతిరేకత అతనికి పుట్టుకతో వచ్చింది. అతని నరనరాన, రక్తంలోనా భారత వ్యతిరేకత ఉంది. 2008, 2009, 20010లో కాశ్మీర్లో జరిగిన హింసాత్మక సంఘటనలు మళ్లీ పునరావృతంకాకుండ ఉండాలంటే ఆలంను అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులు అంటున్నారు.
పోలీసు అధికారులు ఈ విషయం స్పష్టంగా చెప్పడంతో ఆలం కిరాతకాలు, అతని వేర్పాటువాదం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆలం డిగ్రీ వరకు చదివాడు. తర్వాత హురియత్ నేత సయ్యద్ ఆలీషా గిలానికి వారుసుడిగా చేరాడు. 1989లో జరిగిన సాయుధ తిరుగుబాటు సందర్బంగా కాశ్మీర్ లోయలలో విధ్వంసాలు జరిపించాడు. పోలీసులపై దాడులు చేయించాడు. సైన్యం మీద తిరగబడ్డాడు.
ఆలం అరాచకాలు ఎక్కువ కావడంతో అరెస్టు చేసి 1996 వరకు జైలులో పెట్టారు. అప్పటి నుండి పోలీసులు ఆలంను అరెస్టు చెయ్యడం, తర్వాత అతను జామీను మీద బయటకు వచ్చి హింసాత్మక సంఘటనలకు పాల్పడం దినచర్యగా మారిపోయింది. కాశ్మీర్ను పాకిస్థాన్లో విలీనం కావాలనే ముస్లీం లీగ్ పార్టికి పూర్తి మద్దతు ఇచ్చిన ఆలం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.
క్విట్ కాశ్మీర్ ఉద్యమం చేపట్టిన ఆలం!

2008లో ఆలం అరసై జైలులో ఉన్నాడు. తర్వాత అతను విడుదల అయ్యే సమయానికి కాశ్మీర్ అల్లర్లతో అట్టుడుకిపోతున్నది. ఆ సందర్బలో ఆలం ఆందోళన కారులను రెచ్చగొట్టడానికి క్విట్ కాశ్మీర్ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. భారత్ కో దే రగ్దా అనే భారత వ్యతిరేక నినాదాలు చేశాడు. అదే విధంగా గో ఇండియా గో అనే నినాదాలతో భారత వ్యతిరేక ఉద్యమాలు చేపట్టాడు.
కాశ్మీర్ వారంలో 7 రోజుల పాటు ఏ రోజు ఏ ఉద్యమం చెయ్యాలని అంటూ ప్రత్యేక క్యాలెండర్ తయారు చేయించి ఆందోళనకారులకు పంచి పెట్టాడు. సాయుధ బలగాల మీద రాళ్లతో దాడులు చేయించి, రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి వేర్పాటువాదులలో లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని అరాచకాలు ఎక్కువ కావడంతో పోలీసులు అతని కోసం గాలించారు. ఆలం లోయలలోకి వెళ్లిపోయి పోలీసులకు చిక్కకుండా జాగ్రతలు తీసుకున్నారు.
ఆలం ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు బహుమానం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరికి పోలీసులు అతి కష్టం మీద 2010 అక్టోబర్లో ఆలం తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్టు చేశారు. ఆలం వయస్సు 42 సంవత్సరాలు. అతని అర్ద జీవితం జైలులోనే గడిచిపోయింది. 2010 భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన సమయంలో జరిగిన అల్లర్లలో 112 మంది అమాయకులు బలి అయిపోయారు.
-
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications