విశ్వ క్రీడానగరం: వివియస్ లక్ష్మణ్ పిలుపు(పిక్చర్స్)
హైదరాబాద్: చిన్నారులకు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని భారత మాజీ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఐ ప్యాడ్లు, టీవీల్లో కార్టూన్ కథలు, ఫోన్లలో గేమ్స్కు అతుక్కుపోతున్న పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారని, వారిలో క్రీడాసక్తి పెంచాలని అన్నారు. పిల్లల తల్లిదండ్రులే ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు.
ఆగస్టు 27, 28 తేదీల్లో నగరంలో నిర్వహించనున్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో పాల్గొనేవారి కోసం రూపొందించిన మెడల్స్ను, ట్రోఫీని ఆయన బుధవారం ఆవిష్కరించారు. బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతున్న క్రీడాకారులతో హైదరాబాద్ క్రీడానగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్రీడాకారులు, నగర పౌరుల కోసం ప్రోత్సాహకరంగా మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.

వివియస్ లక్ష్మణ్
చిన్నారులకు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని భారత మాజీ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

వివియస్ లక్ష్మణ్
ఐ ప్యాడ్లు, టీవీల్లో కార్టూన్ కథలు, ఫోన్లలో గేమ్స్కు అతుక్కుపోతున్న పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారని, వారిలో క్రీడాసక్తి పెంచాలని అన్నారు. పిల్లల తల్లిదండ్రులే ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు.

వివియస్ లక్ష్మణ్
ఆగస్టు 27, 28 తేదీల్లో నగరంలో నిర్వహించనున్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో పాల్గొనేవారి కోసం రూపొందించిన మెడల్స్ను, ట్రోఫీని ఆయన బుధవారం ఆవిష్కరించారు.

వివియస్ లక్ష్మణ్
బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వివియస్ లక్ష్మణ్
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతున్న క్రీడాకారులతో హైదరాబాద్ క్రీడానగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్రీడాకారులు, నగర పౌరుల కోసం ప్రోత్సాహకరంగా మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.

వివియస్ లక్ష్మణ్
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో 16వేల మంది పాల్గొనబోతుండడం అభినందనీయమన్నారు.

వివియస్ లక్ష్మణ్
మారథాన్ రేస్ డైరెక్టర్ డా. మురళి నన్నపనేని మాట్లాడుతూ.. ఆరో విడతగా నిర్వహిస్తున్న ఎయిర్టెల్ మారథాన్లో రన్నర్లను ప్రోత్సహించడానికి 50 కిపైగా మ్యూజిక్ బ్యాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, వినోద కార్యక్రమాలు ప్రదర్శిస్తామన్నారు.

వివియస్ లక్ష్మణ్
ఆగస్టు 27ను 5వేల మందితో 5కె రన్, 28న 11వేల మందితో ఆఫ్ మారథాన్ రన్, ఫుల్ మారథాన్ రన్లను నిర్వహిస్తామన్నారు.

వివియస్ లక్ష్మణ్
భారతీ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల సీఈఓ వెంకటేష్ విజయరాఘవన్ మాట్లాడుతూ.. ఎయిర్టెల్ మారథాన్ రన్ ఎంతో ఆదరణ పొందుతోందన్నారు. దేశ, విదేశాలకు చెందిన రన్నర్లు మారథాన్లో పాల్గొనబోతున్నారన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications